Kanthara -2 సినిమా రాబోతోందా..!!

కన్నడలో రూపొందించిన చిత్రం కాంతారా. ఈ సినిమా అత్యంత తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించి అత్యధిక కలెక్షన్లు రాబట్టి మొదటి స్థానంలో నిలిచింది. ముఖ్యంగా కాంతర సినిమాలోని కాన్సెప్ట్ యూనివర్సల్ అన్నట్లుగా ప్రేక్షకులను బాగా మెప్పించింది. ముఖ్యంగా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో డైరెక్టర్ ,హీరో రిషబ్ శెట్టి సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. కేజిఎఫ్ సిరీస్ ను నిర్మించిన హంభలే వారు ఈ సినిమాని నిర్మించారు. తాజాగా కన్నడ మీడియాలో ఈ సినిమా గురించి పలు వార్తలు వినిపిస్తున్నాయి.

Kantara 2: Rishab Shetty starrer's sequel in plans; here's what to expect  from period action drama | Regional-cinema News – India TVకాంతారా సినిమా సీక్వెల్ గురించి ఎక్కువగా వార్తలు వైరల్ గా మారుతున్నాయి. కాంతార సినిమా ముగిసిన తీరు చూస్తుంటే ఈ సినిమా సీక్వెల్ ఉండే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. తాజాగా మేకర్స్ కాంతారా సినిమా యొక్క సీక్వెల్ గురించి కన్ఫామ్ చేసినట్లుగా సమాచారం. కాంతారా సినిమాను ఆస్కార్ తో పాటు పలు అవార్డుల వేదికకు పంపించామని నామినేషన్ కోసం వెయిట్ చేస్తున్నామని ఆ హడావిడి ముగిసిన తర్వాత కాంతారా సినిమా యొక్క మొదలుపెట్టబోతున్నట్లుగా డైరెక్టర్ చిత్ర బృందం తెలియజేసినట్లు కన్నడ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.

రిషబ్ శెట్టి కాంతార తర్వాత ప్రస్తుతం కాస్త వెకేషన్లను ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. త్వరలోనే రిషబ్ శెట్టి మంచి స్క్రిప్ట్ వరకు మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా సీక్వెల్ కోసం అటు కన్నడ అభిమానులతో పాటు సిని ప్రేక్షకులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. దాదాపుగా రూ 20 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం రూ.400 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టినట్లు సమాచారం. మరి చిత్ర బృందం అధికారికంగా ఈ సినిమాలపై ఎప్పుడు ప్రకటిస్తుందో చూడాలి.