ఆ విషయంలో ప్రభాస్ సతమతమవుతున్నారా..?

టాలీవుడ్ లో స్టార్ హీరోగా పేరుపొందిన ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా కూడా పేరు పొందుతున్నారు. కేవలం బాహుబలి, బాహుబలి-2 సినిమాలు ప్రభాస్ కెరీయర్నే మార్చేశాయి. ఈ రెండు సినిమాలు ప్రభాస్ కు ఊహించని స్థాయిలో గుర్తింపు లభించడంతో ప్రభాస్ తన తదుపరి చిత్రాలు పైన భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఎన్నో అంచనాల మధ్య విడుదలైన సాహో, రాధే శ్యామ్ చిత్రాలు ప్రభాస్ కు భారీ ప్లాప్ ను ఇచ్చాయి. దీంతో ప్రభాస్ కెరియర్ కాస్త ఈ సినిమాల ప్రభావం పడిందని చెప్పవచ్చు.

Kriti Sanon On Those Prabhas Rumours: Absolutely Baseless, Let Me Burst  Your Bubble
ప్రభాస్ చేతిలో ప్రస్తుతం ఆది పురుష్, సలార్, ప్రాజెక్ట్ -k, మారుతి దర్శకత్వంలో ఒక చిత్రంలో నటిస్తూ ఉన్నారు. అయితే ఆదిపురేష్ సినిమా వచ్చే ఏడాది విడుదల చేయాలనుకున్నారట. కానీ కొన్ని కారణాల చేత ఈ సినిమా 2024 కి వాయిదా వేశారని సమాచారం. ప్రభాస్ ప్రస్తుతం ఆన్ని క్రేజీ ప్రాజెక్టులు ఒకేసారి విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా ఇమేజ్ను కాపాడుకోవడానికి ప్రభాస్ ప్రస్తుతం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ప్రభాస్ తీసుకున్న ఒక నిర్ణయం విషయంలో అభిమానుల సైతం చాలా సంతోషిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభాస్ ఆది పురుష్ సినిమాతో రిస్క్ తీసుకోవడమే కరెక్ట్ అని గ్రాఫిక్స్ కు సంబంధించి పూర్తిస్థాయిలో మార్పులు చేసిన తరువాతే ఆది పురుష్ ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

ఆదిపురుష్ సినిమా రిలీజ్ డేట్ గురించి మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఈ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే అభిమానులు మాత్రం బాలీవుడ్ డైరెక్టర్ లో నటించవద్దని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం తన ఇమేజను కాపాడుకోవడం కోసమే ఆదిపరుష్ సినిమాని ఎలాగైనా విడుదల చేయాలని చూస్తున్నారు ప్రభాస్.