కోలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న నయనతార తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. హీరోయిన్ లలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ అందుకుంటున్న వారిలో ఈమె కూడా ఒకరు. ప్రస్తుతం నయనతార ఒక్కో చిత్రానికి రూ .8 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రమోషన్ విషయంలో ఏ హీరోయిన్ పై లేని స్థాయిలో నయనతార పైన విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. ఎంతోమంది రిక్వెస్ట్ చేసినా నయనతార మాత్రం సినిమా ప్రమోషన్స్ విషయంలో పెద్దగా ఆసక్తి చూపించలేదని వార్తలు వినిపిస్తూ ఉంటాయి.
కానీ నయనతార నటించిన కనెక్ట్ మూవీ మరికొన్ని గంటలలో థియేటర్లలో విడుదల కానుంది. ఇంటర్వెల్ లేకుండా విడుదలవుతున్న ఈ సినిమా విషయంలో ప్రేక్షకులలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. థియేటర్ల ఓనర్లలో చాలామంది ఈ సినిమా విడుదల సమయంలో పెద్దగా ఆసక్తి చూపలేదని వార్తలు వినిపిస్తున్నాయి. నయనతార కూడా తన భర్త తెరకెక్కించిన ఈ సినిమా అయినా కూడా ప్రమోషన్లలో పాల్గొనడానికి ఆసక్తి చూపడం లేదట. మూవీ ప్రమోషన్స్ విషయంలో నయనతార ఎంత కఠినంగా వ్యవహరించడం కరెక్ట్ కాదని ఆమె అభిమానులు భావిస్తూ ఉన్నారు.
కనెక్ట్ మూవీ లో నయనతార పాత్ర చాలా కీలకమని సరైన ప్రమోషన్ లేకుంటే ఈ సినిమా సక్సెస్ సాధించడం చాలా కష్టమని వార్తలు వినిపిస్తున్నాయి. తన భర్త విగ్నేష్ కు కూడా భారీ నష్టం వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది . ఈ ఒక్క విషయంలో నయనతార పూర్తిగా మారాలని అభిమానులు భావిస్తున్నారు. ఇదే వ్యవహారం కంటిన్యూ చేస్తే నయనతార రాబోయే రోజుల్లో తన చిత్రాలు ఆడడం ఆఫర్లు రావడం కష్టమేనని కొంతమంది సినీ ప్రముఖులు సైతం తెలియజేస్తున్నారు. మరి ఈ విషయంపై నయనతార దంపతులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.