ర‌కుల్ ఇంత పెద్ద ఉచ్చుల్లో చిక్కుకుందా… కెరీర్ డేంజ‌ర్‌లోనే…!

టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు ఎంత రచ్చ చేసిందో తెలిసిందే. ఆ రచ్చ ఎప్పటికి కూడా టాలీవుడ్ ను విడిచి పోలేదు. ఈడీ ఈ డ్రగ్స్ వ్యవహారంపై ఇప్పటికీ కూడా విచారణ చేస్తూనే ఉంది. అయితే ఇప్పుడు తాజాగా స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను ఈడీ మరోసారి విచారణకు రమ్మని షాక్ ఇచ్చింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే ఆమెను గత సంవత్సరం విచారించిన ఈడీ.. తాజాగా మరోసారి ఆమెకు నోటీసులు జారీ చేసింది.

గతంలో రకుల్ విచారణ జరుగుతున్న మధ్యలోనే ఆమె వెళ్లిపోయారు. దీంతో ఆమె పూర్తిస్థాయి విచారణ జరగకపోవడంతో మరోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. కాగా టాలీవుడ్ డ్రగ్స్ కేసులో భాగంగా మనీ లాండ‌రింగ్ చట్టం కింద 12 మందికి ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. గత సంవత్సరం ఆగస్టు 31వ తేదీ నుంచి సెప్టెంబ‌ర్‌ 22వ తేదీ వరకు సీట్ ఏర్పాటు చేసి మరీ పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలను కూడా విచారణకు పిలిపించింది.

అలా విచారణకు వచ్చిన వారిలో పూరి జగన్నాథ్, ఛార్మి, రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్, దగ్గుపాటి రానా, ముమైత్ ఖాన్, నందు, తనీష్, తరుణ్, నవనీత్, పబ్ మేనేజర్, రవితేజ కార్ డైవర్ శ్రీనివాసులు కూడా ఉన్నాడు. ఇప్పుడు మరోసారి రకుల్ ప్రీత్ సింగ్ ను విచారణలో ఏ విషయం బయటకు రాబోతుందో తెలియాల్సి ఉంది. ఏదేమైనా ర‌కుల్ కెరీర్ ఇప్ప‌టికే ఫేడ‌వుట్ అయిపోయింది. ఈ కేసులో ఆమె చిక్కుకుంటే కెరీర్ డేంజ‌ర్ జోన్‌లో ప‌డిన‌ట్టే అవుతుంది.