బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కు ఎవరు ఊహించిన విధంగా చేదు అనుభవం ఎదురయింది. ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. ఆయన దగ్గర నుంచి చాలా ఖరీదైన వాచీలు.. పలు రకాల వస్తువులు స్వాధీనంనం చేసుకున్నారు. షారుక్ దుబాయ్ నుంచి తిరిగి వస్తుండగా భద్రత సిబ్బంది షారుక్ ను ఆపేశారు. తర్వాత ఆయన దగ్గర నుంచి 18 లక్షల ఖరీదైన లగ్జరీ వాచీలు ఆయన బ్యాగ్ లో ఉండగా ఎయిర్పోర్ట్లోని కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. అయితే ఆ తర్వాత వాటిపై కస్టమ్ డ్యూటీ మొత్తం 6.83 లక్షలను షారుక్ కట్టాడు. కస్టమ్స్ డ్యూటీ చెల్లించిన తర్వాతే విమానాశ్రయం నుంచి ఆయనను వెనక్కి పంపించారు.
షారూక్ను ను విమానాశ్రయంలో అడ్డుకోవడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ ఇలా చాలాసార్లు జరిగాయి. 2011లో కూడా విదేశీ వస్తువులను తీసుకువచ్చారని కస్టమ్స్ అధికారులు అప్పుడు కూడా 1.5 కోట్ల జరిమానా వేశారు. షారుఖాన్ ప్రస్తుతం పఠాన్ సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ఆయనకు జోడిగా దీపిక పదుకొనే నటిస్తుంది. ఇక 2023 రిపబ్లిక్ డే కనుగా జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దుబాయ్లోని షార్జాలో జరిగిన ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్- 2022లో పాల్గొన్న షారూక్ తిరిగి మళ్ళి ముంబై చేరుకున్నారు.