కృష్ణ మరణంతో మరింత రెచ్చిపోతున్న పవిత్ర లోకేష్.. మహేశ్ ను అంత మాట అన్నిందా..?

గత కొన్ని నెలలుగా సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరో నరేష్ ..క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ పేర్లు ఏ రేంజ్ లో వైరల్ గా మారాయో మనకు తెలిసిందే. ఇన్నాళ్లు గుట్టు చప్పుడు కాకుండా మెయింటైన్ చేసిన రిలేషన్షిప్ ని ఇప్పుడు పబ్లిక్ గా అందరికీ తెలిసేలా మెయింటైన్ చేస్తున్నారు నరేష్. కాగా వీళ్ళకి సంబంధించిన డేటింగ్ మేటర్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రోలింగ్ అవుతూనే ఉంది . అయినా కానీ ఏ మాత్రం పట్టించుకోని నరేష్ తనకు పవిత్రలోకేష్ నే ఇంపార్టెంట్ అంటూ ఆమెకే ఎక్కువ వాల్యూ ఇస్తూ నెత్తి మీద పెట్టుకుంటున్నట్లు జనాలు చెప్పుకొస్తున్నారు.

అంతేకాదు రీసెంట్గా సూపర్ స్టార్ సీనియర్ హీరో కృష్ణ మరణించినా.. ఆ బాధ ఆయనకి ఏమీ లేదని ..అక్కడ ఆయనకు పవిత్ర లోకేష్ ఇంపార్టెంట్ అనేంతలా ఆయన బిహేవ్ చేసే పద్ధతే ఉందని.. దానికి బెస్ట్ ఉదాహరణ పవిత్ర లోకేష్ బుజం పై ఆయన అక్కడ ఆ పరిస్ధితుల్లో చెయ్యి వేయడం అని చెప్పుకొస్తున్నారు. మరీ ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ చనిపోయిన తర్వాత నరేష్ ప్రవర్తించిన తీరు ఘట్టమనేని ఫ్యాన్స్ కు కోపం తెప్పిస్తుంది . కృష్ణ పార్థివ దేహం అక్కడ ఉంటే ఆయన పవిత్ర లోకేష్ పై చేయి వేసి ఇంటి లోపలికి తీసుకురావడం అస్సలు ఏం బాగోలేదని చెప్పుకొస్తున్నారు.


తనకి తండ్రి లాంటి ఆయన అక్కడ చనిపోయి ఉంటే .. ఆయన పార్థివదేహం చూడడానికి వచ్చిన పెద్ద మనుషులను నవ్వుతూ పలకరించడం షాకింగ్ గా అనిపించిందని ఘట్టమనేని అభిమానులు చెప్పుకొస్తున్నారు. అంతేకాదు మహేష్ బాబును పరామర్శించడానికి వచ్చిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ని, ప్రొడ్యూసర్ ని.. నరేష్ చులకనగా మాట్లాడాడని ఓ న్యూస్ కూడా వైరల్ అవుతుంది. కాగా రీసెంట్గా పవిత్ర లోకేష్ తనకు ఘట్టమనేని ఇంటికి కోడలు స్థానం కల్పించాలని కొత్త డిమాండ్ ను నరేష్ కు పెట్టిందట .

ఇప్పటికే మన రిలేషన్ షిప్ ను అందరు తప్పుగా అనుకుంటున్నారని ..ఘట్టమనేని ఫ్యామిలీకి మహేష్ బాబు భార్యగా నమ్రత ఎలాంటి అధికారాలు దక్కించుకుందో ..నరేష్ భార్యగా నేను అలాగే అధికారులు దక్కించుకోవాలనుకుంటున్నానని ..నరేష్ కి పవిత్ర లోకేష్ కొత్త డిమాండ్ పెట్టిందట. అంతేకాదు మహేష్ బాబుకు నువ్వు ఏ మాత్రం తీసిపోవని.. ఇంట్లో పూర్తి అధికారాలు నీకు మహేష్ కు సగం సగం ఉండాలని ఆమె కొత్త ప్రపోజలను తీసుకొచ్చిందట. ఈ క్రమంలోనే ఘట్టమనేని ఫ్యాన్స్ పవిత్ర లోకేష్ పై మండిపడుతున్నాడు. నమ్రతతో నీకు పోలిక ఏంటి ..ఆమె కుటుంబం కోసం తన ప్యాషన్ వదులుకుంది ..నీలాగా పరాయి మగాడి కోసం ఫ్యామిలీని వదులుకొని రాలేదు అంటూ మండి పడుతున్నారు . ఏది ఏమైనా సరే కృష్ణ మరణించిన తర్వాత పవిత్ర లోకేష్ కు నోరు ఎక్కువైపోయిందని ఆమెను ట్రోల్ చేస్తున్నారు కృష్ణ ఫ్యాన్స్.