సాయిప‌ల్ల‌వి సైలెన్స్ వెన‌క అస‌లు ఏం జ‌రిగింది…!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నది హీరోయిన్ సాయి పల్లవి. ఎంతో అద్భుతమైన పాత్రలో నటించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. గ్లామర్ పాత్రలకు చోటు లేకుండా కేవలం సినిమాలలో నటిస్తూ ఎంతోమంది అభిమానులను సైతం సంపాదించుకుంది. అయితే ఈ ముద్దుగుమ్మ తెలుగులో నటించిన చివరి చిత్రాలు విరాటపర్వం, గార్గి ఇక తర్వాత ఎలాంటి సినిమాలను ఈమె ప్రకటించలేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా సాయి పల్లవి తన గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.

Sai Pallavi Compares Kashmiri Pandit Exodus to Cow Vigilantism, Sparks  Twitter Row
సాయి పల్లవి సినిమా కథన వినేటప్పుడు కేవలం కథ మొత్తం తన చుట్టూ తిరుగుతుందా లేదా అనే విషయాన్ని చాలా పరిశీలిస్తుందట. ఒకవేళ తను చేసే పాత్ర తనకు సంతృప్తి కలిగినట్లు అయితే ఆ విషయాన్ని మాత్రమే పరిగణంలోకి తీసుకొని నటిస్తానని తెలియజేసింది. ఒక పాత్రలో తను నటించడం కోసం ఎలాంటి కండిషన్లు పెట్టుకోనని ఆ పాత్రలో నటించడానికి కేవలం తన సిద్ధంగా ఉన్నట్లు అయితేనే ఆ పాత్రని ఒప్పుకుంటానని తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ.

ఇకపోతే తాను ఒక సినిమా కథ వినేటప్పుడు ఒక హీరోయిన్గా కాకుండా ఒక సాధారణ ప్రేక్షకుడిగా ఈ సినిమాని ఎలా ఆస్వాదిస్తారో అలా కథను వింటానని తెలియజేసింది. అలా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని తన సినిమా కథలను ఎంపిక చేసుకుంటానని తెలియజేసింది. అయితే విన్న కథ ప్రతిసారి ఒకే విధంగా తెరకెక్కించడం కుదరకపోవడం వల్ల కొన్ని సార్లు మార్పులు చేయవలసి ఉంటుంది. అలా మార్పులు చేసినప్పుడు తప్పకుండా ఒక చేదు ఫలితాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. అది కూడా ఒక గుణపాటమే అని ఈ సందర్భంగా తెలియజేసింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండడం చేత తన కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నాను అందుచేతనే కాస్త గ్యాప్ తీసుకొని సినిమాలో నటించాలనుకుంటున్నానని తెలియజేసింది. ఇక పుష్ప సినిమాలో కూడా నటించలేదని తెలియజేసింది.