సినిమా ఇండస్ట్రీలో హీరోగా హీరోయిన్లుగా రావడానికే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రావడానికి కూడా కష్టపడాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా ప్రజెంట్ ఉండే దర్శకనిర్మాతలు ఎక్కువగా రంగుని చూసే అవకాశాలు ఇస్తారు అంటున్నాడు టాలీవుడ్ టాప్ కమెడియన్ ప్రియదర్శి , ఎస్ ప్రస్తుతం ప్రియదర్శి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి.
పెళ్లిచూపులు సినిమాతో పాపులారిటీ సంపాదించుకున్న ప్రియదర్శి ఆ తర్వాత చాలా సినిమాల్లో కమెడియన్ గా నటించాడు.. చేసిన అన్ని సినిమాల్లో తనదైన స్టైల్ లో కామెడీని పండిస్తూ వల్గారింటికి దూరంగా కామెడీ పంచ్ లు వేస్తూ జనాలను కడుపుబ్బ నవ్వించాడు . పెళ్లి చూపులు సినిమాలో ఆయన చెప్పిన ఒకే ఒక్క డైలాగ్ తో అతను క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది . “నా చావు నేను చస్తా అనే పుస్తకం రాస్తున్న” అంటూ ప్రియదర్శి చెప్పిన డైలాగ్ ఇప్పటికీ యూత్ ఆకట్టుకుంటుంది .
కాగా ఈ సినిమా తర్వాత అర్జున్ రెడ్డి, జై లవకుశ, జాతి రత్నాలు , రాధేశ్యామ్, సీతారామమ వంటి సినిమాలలో నటించి జనాలకు మరింత దగ్గర అయ్యాడు. ప్రజెంట్ టాప్ పోజీషన్ లో ఉన్న ఈయన కెరీర్ స్టార్టింగ్ లో ఇండస్ట్రీలో బాడీ షేమింగ్ కామెంట్స్ కు బలైయాడట. సినిమాలో రోల్ కోసం ఆడిషన్స్ కి వెళ్లినప్పుడు ఆయన రంగు గురించి చులకనగా మాట్లాడారట. ” నేను చాలా సినిమాల్లో నటించడానికి ఆడిషన్స్ కి వెళ్ళినప్పుడు నా కలర్ గురించి నా ముందే చెత్తగా మాట్లాడుతూ నన్ను సినిమా నుంచి రిజెక్ట్ చేశారని చెప్పుకొచ్చాడు”. “హైట్ గా ఉన్నావ్..సన్నా గా ఉన్నవ్..మరీ నల్లగా ఉన్నావ్ అంటూ ఆయనని బాధపెట్టారట”. ప్రియదర్శి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.