సినీ ఇండస్ట్రీలో అల్లు ఫ్యామిలీ,మెగా ఫ్యామిలీ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. అల్లు అరవింద్ నిర్మాతగాఎన్నో సినిమాలకు వ్యవహరించారు. ఇక ఈయన కుమారులు అల్లుబాబి నిర్మాతగా ఉండగా, అల్లు అర్జున్ హీరోగా నటిస్తూ ఉండగా, అల్లు శిరీష్ కూడా హీరోగా పలు సినిమాలలో నటిస్తూ ఉన్నారు. సినీ ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి ఒక్కో పిచ్చితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కొంతమందికేమో స్టార్ ఇమేజ్ తెచ్చుకోవాలని ఆలోచనతో ఉంటారు. మరి కొంతమంది డబ్బులు బాగా సంపాదించుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. ఇలా ఒక్కొక్కరు ఏదో ఒక పిచ్చితో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ ఉంటారు.
సినీ ఇండస్ట్రీలో మొదట కమెడియన్గా ఆ తర్వాత స్టార్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు సంపాదించుకొని ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు అల్లు అరవింద్. ఇక ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య గారి కొడుకు గా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత స్టార్ ప్రొడ్యూసర్ గా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు వ్యవహరించారు. ఇక సినిమాలు విషయానికి పక్కన పెడితే అల్లు అరవింద్ కి ఒక రకమైన పిచ్చి ఉందట వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అదేమిటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా తనకు పాపులారిటీ రావాలని ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఏదైనా మీడియా ముందుకు వచ్చినప్పుడు కచ్చితంగా అందరి దృష్టి తన వైపే ఉండాలని అనుకుంటూ ఉంటారు. ఒకవేళ ఏదైనా ఈవెంట్లో అలా ప్రసంగించాల్సి వస్తే దానికి వారం రోజులు ముందు నుంచి తన స్క్రిప్టును కూడా రెడీ చేసుకుని తన మాటలతో అక్కడ అందరినీ ఆకర్షిస్తారని సమాచారం. ఒకవేళ అల్లు అరవింద్ తన కొడుకుల గురించి మాట్లాడాల్సి వచ్చిన కూడా తన కొడుకుల కంటే తానే ఎక్కువగా హైలైట్ అవ్వాలని కోరుకుంటూ ఉంటారు. ఈ విషయం ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ విషయం గతంలో అల్లు అరవింద్ మాట్లాడిన స్పీచ్ లను చూస్తే మనకి అర్థమవుతుంది.