ఇటీవల కొందరు మీడియా ముఖంగా పలు సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా యమదొంగ విక్రమార్కుడు ,గుంటూరు టాకీస్ తదితర చిత్రాలలో నటించిన నటి జయవాణి తనని ఒక దర్శకుడు మోసం చేశారంటూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. కెరియర్లో ఎదురైన తనకు చేదు అనుభవాల గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపింది వాటి గురించి తెలుసుకుందాం.
జయవాణి మాట్లాడుతూ.. తన కెరియర్ లో తనకి ఎక్కువగా విలన్ పాత్రలే వచ్చాయని జయవాణి తెలియజేస్తోంది. ఒకే తరహా పాత్రలో నటించడం తనకి అసలు ఇష్టం లేదని తెలియజేసింది.ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో తనని చాలామంది నల్లగా ఉన్నావని అవమానించే వారట.
నువ్వు నటిక పనికిరాని కూడా తన ముఖం మీద చెప్పేవారట. దీంతో ఎలాగైనా ఇండస్ట్రీలో కొనసాగాలని చాలా కష్టపడ్డానని తెలియజేసింది జయవాణి. ఇక ఒక డైరెక్టర్ అయితే సినిమా ఛాన్స్ ఇస్తానని పిలిచి తన ఫోటోషూట్లు చేశారట ఆ తర్వాత దర్శకుడు నుంచి ఎటువంటి ఫోన్ కాల్ కూడా రాలేదని ఆ ఫోటోషూట్ కి సంబంధించిన ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో లీక్ చేశారని తెలియజేసింది.
అయితే పలు వెబ్సైట్లో ఆ ఫోటోలు పెట్టిన ఆ వ్యక్తి ఎవరో తెలియదు కానీ అయితే అవి తన కెరీర్ కు ఒక మచ్చలాగా మిగిలిపోయిందని తెలిపింది. అవకాశాల కోసం ఎన్నో విధాలుగా ప్రయత్నించిన చిన్న చిన్న క్యారెక్టర్లే ఇచ్చే వారిని వచ్చిన పాత్రకు నేను 100% న్యాయం చేశానని తెలిపింది. ఎక్కువగా తనకి బోల్డ్ క్యారెక్టర్లు వస్తున్న తనకి ఇష్టం లేక చేయలేదని తెలుపుతోంది. సినిమాలంటే చాలా పిచ్చి అని అందుచేతనే ఈ రంగంలోకి అడుగు పెట్టానని తెలిపింది జయవాణి.