TEASER:వాల్తేరు వీరయ్య తో రచ్చ లేపుతున్న చిరంజీవి..!!

చిరంజీవి తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. ఈ మధ్యకాలంలో వరుస పెట్టి సినిమాలు చేస్తే మంచి విజయాలను అందుకుంటున్నారు. ఈరోజు దీపావళి పండుగ సందర్భంగా.. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా నుంచి టీజర్ ని విడుదల చేశారు చిత్ర బృందం. ఈ సినిమాకి డైరెక్టర్ గా బాబి దర్శకత్వం వహిస్తున్నారు.టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్ గా పేరుపొందిన మైత్రి మూవీ బ్యానర్ పై ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దీపావళి పండుగ సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ చిత్రానికి సంబంధించి ఒక సడన్ సర్ప్రైజ్ ట్రీట్ ఇవ్వడం జరిగింది.

Mega 154 first-look poster is out. Chiranjeevi is back as the mass hero -  India Today

ఈ చిత్రంలో చిరంజీవి పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ గా కనిపిస్తూ ఉన్నారు. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా శృతిహాసన్ నటిస్తున్నది. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.చిరంజీవి నటిస్తున్న 154వ సినిమా ఇది. గత కొద్దిరోజులుగా వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ప్రచారంలో ఉంది అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు ఈ సినిమా టైటిల్ ఫిక్స్ చేయడం జరిగింది.ఈ సందర్భంగా టైటిల్ తో పాటు టీజర్ ని కూడా రిలీజ్ చేశారు చిత్ర బృందం. అందుకు సంబంధించి టీజర్ కూడా వైరల్ గా మారుతోంది.

ఇక టీజర్ విషయానికి వస్తే.. ఏంట్రా వాడొస్తే పూనకాల అన్నారు.. అడుగు వేస్తే అరాచకం ఆన్నారు.. సౌండే లేదు అని విలన్ అంటూ ఉండగా.. చిరంజీవి ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. ఇక చిరంజీవి ఇందులో ఒకప్పటి చిరంజీవిలాగా కనిపిస్తూ ఉన్నారు. ఇక అంతే ఎనర్జీటీతో మాస్ గెటప్పులో చాలా స్టైలిష్ గా కనిపిస్తూ ఉన్నారు. ఇక చివరిగా చిరంజీవి చెప్పే డైలాగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా కనిపిస్తోంది. చివర్లో రవితేజ హ్యాపీ దివాళి తొందరలోనే కలుద్దాం అంటూ వాయిస్ వినిపించారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి టీజర్ వైరల్ గా మారుతుంది.