రాజమౌళి-మహేష్ సినిమాలో అదిరిపోయే యాక్షన్ సీన్స్.. ఇక సీన్ సితారే?

సూపర్ స్టార్ మహేష్ ‘సర్కారు వారి పాట’ సినిమాతో అందరినీ ఎంతగానో అలరించారు. ప్రస్తుతం రాజమౌళి, మహేష్ కాంబినేషన్‌లో వచ్చే సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి ఎపుడైయితే మహేష్‌తో తీసే సినిమా అనేది భారత చలన చిత్ర సీమలో అతి పెద్ద చిత్రం అని చెప్పాడో అప్పటినుంచి ఆ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అంతేకాకుండా, రాజమౌళి ఇటీవలే విదేశీ విలేకరులతో జరిగిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎవరికి తెలియని కొన్ని ఆంగ్ల పదాలను వాడారు. దాంతో అందరూ ఆ ఆంగ్ల పదాలకు అర్థాలు వెతికే పనిలో ఉన్నారు.

రాజమౌళి ఈ సినిమాలో మహేష్‌తో ఎన్నడూ చూడాలి యాక్షన్ సీన్స్ చూపించనున్నాడట. అలానే ఇంతకుముందెన్నడూ చూడని పాత్రలో మహేష్ కనిపిస్తాడని టాక్. ఈ సినిమాలో ఇంటర్వెల్‌లో వచ్చే సీన్‌లో మహేష్ ఒక గుహలో నర మాంస భక్షకులతో ఫైట్ చేస్తాడట. ఈ పోరాట దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయట. మహేష్ బాబుతో రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతుందని రచయిత కె.వి విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఇది భారీ బడ్జెట్‌తో 2023లో సెట్స్‌పైకి వెళ్లనుంది.

ఇది మాత్రమే కాకుండా ఇలాంటి చాలా సీన్స్‌ మహేష్ కోసం ప్రిపేర్ చేస్తున్నాడట రాజమౌళి. ఈ సినిమాలో మహేష్‌తో కలిసి దీపికా పదుకొణే నటించబోతుందని సమాచారం. ఈ సినిమాలోని సనివేశాలను ఆఫ్రికా అడవులో తీయబోతున్నారట. అంతే కాకుండా రాజమౌళి నిజ జీవితంలోని కొన్ని భావోద్వేగ సన్నివేశాలను కూడా ఈ సినిమాలో జోడించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు మహేష్ బాబు SSMB 28 సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. SSMB 28 అనేది త్రివిక్రమ్ మహేష్ కాంబోలో వస్తున్న 3వ మూవీ. గతంలో వీరు అతడు, ఖలేజా కోసం కలిసి పనిచేశారు.