అందరి ముందే శ్రియను అలా అడిగేసిన తరుణ్.. ఏం చేసిందో చూడండి..!!

“ఈ వర్షంలో మిరపకాయ బజ్జి ఎలాంటి ఎదవైనా తింటాడు.. కానీ ఐస్ క్రీం తినేవాడే రొమాంటిక్ ఫెలో” ఈ డైలాగ్ చెప్పగానే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు తరుణ్ . ఎస్ తను నటించిన నువ్వే నువ్వే సినిమాలో ఈ డైలాగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు . అక్టోబర్ 10 2022 హీరోగా తరుణ్ ,హీరోయిన్ గా శ్రియ, ప్రధాన పాత్రలో ప్రకాష్ రాజ్ ..నటించిన సినిమా నువ్వే నువ్వే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులను కొల్లగొట్టింది. ఇండియన్ సినిమా చరిత్రను తిరగ రాసింది. మరీ ముఖ్యంగా ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్.

అప్పటివరకు డైరెక్టర్స్ అదే లవ్ స్టోరీ లతో బోర్ కొట్టించేసిన జనాలకు.. సరికొత్త లవ్ స్టోరీ ని రుచి చూపిస్తూ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు అదిరిపోయే తండ్రి-కూతురు-బాయ్ ఫ్రెండ్ లవ్ స్టోరీని చూపించాడు. ఈ సినిమాలో సునీల్ నటన సినిమాను మరో మెట్టు ఎక్కించిందనే చెప్పాలి . మరి ముఖ్యంగా ఈ సినిమాలో పాటలు కూడా జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఏ చోట ఉన్న సాంగ్ ఇప్పటికీ జనాలు వింటున్నారు అంటే దానికి కారణం మ్యూజిక్ డైరెక్టర్ కోటి అనే చెప్పాలి.

కాగా నిన్నటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ శుభ సందర్భంలో చిత్ర యూనిట్ అందరూ ఒక్కసారిగా గెట్ టు గెదర్ ఏర్పాటు చేసుకొని సినిమాను మరోసారి చూసి ఎంజాయ్ చేశారు. ఈ క్రమంలోనే సినిమా చూసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన మూవీ టీం మీడియాతో సినిమాకు సంబంధించిన విషయాలను పంచుకున్నారు . ఈ క్రమంలోని శ్రియ మాట్లాడుతూ.. సినిమాతో తనకున్న ఎమోషన్ ని బయటపెడుతూ తరుణ్ ని ఓ రేంజ్ లో పొగిడేస్తుంది.

” ఈ సినిమాలో నాకు సహకరించిన తరుణ్ కి థాంక్స్” అంటూ చెప్పుకొచ్చింది . అంతేనా అతని దగ్గరకు వెళ్లి కౌగిలించుకొని మరి ముద్దు పెట్టింది . దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారు షాక్ అయ్యారు. అందరి ముందే తరుణ్ ” అప్పటికి ఇప్పటికి ఒకేలా ఉన్నావు శ్రియ.. కాకపోతే నీకు పెళ్లయింది పాప ఉంది,,గుర్తు పెట్టుకో” అంటూ చమత్కరించాడు .దీంతో ఒక్కసారి అక్కడ నవ్వులు పూసాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.