టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొదటి సినిమాతోనే భారీ విషయాన్ని అందుకొని ఆ తర్వాత వరుస సినిమాలతో పాటు, పలు బుల్లితెర షోలు కూడా చేస్తూ ఫుల్ బిజీ అయింది. అదే సమయంలో హీరో నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న సమంత నాలుగేళ్ల తర్వాత విడిపోయి అందరికీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీని గురించి ఇప్పటికి కూడా రకరకాల కామెంట్లు రావడం మనం చూస్తూనే ఉన్నాము. అయినా సమంత వీటిని పెద్దగా పట్టించుకోలేదు. తన లైఫ్లో తాను బిజీగా గడిపేస్తోంది. ఇక నాగచైతన్య తో విడిపోయిన తర్వాత సమంత ఇప్పుడు సినిమాలు విషయంలో మరింత దూకుడుగా ఉంటోంది.
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమంత వరుస సినిమాలో ఒప్పుకుంటూ బిజీ హీరోయిన్గా మారింది. ఒకపక్క తెలుగులో సినిమాలు చేస్తూనే మరోపక్క ఇతర భాషల్లో ప్రాజెక్ట్ పై సైన్ చేస్తూ మరింత బిజీగా మారిపోతోంది.ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లపై కూడా దృష్టి పెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే శాకుతలం తెలుగు సినిమాను పూర్తి చేసింది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చాలాకాలం అవుతున్న ఇంకా విడుదలకు నోచుకోలేదు. ప్రస్తుతం తెలుగులో ఈమె నటించిన యశోద సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మరొకవైపు ఖుషి సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉంది. అంతేకాదు హిందీలో ఒక వెబ్ సిరీస్ కూడా చేస్తోంది సమంత.
ఇదిలా ఉండగా.. సమంత ఇప్పుడు భారీగా పారితోషకం పెంచేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి తన సినిమాలకు దాదాపుగా రూ. 4 నుండి రూ. 8 కోట్ల వరకు వసూలు చేస్తోందని సమాచారం. రాబోయే తెలుగు చిత్రాలకు కూడా అదే మొత్తాన్ని తీసుకుంటుందని టాక్. ఇక ఇదే నిజమైతే టాలీవుడ్ లో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్గా సమంత గుర్తింపు తెచ్చుకుంటోంది.