అక్కినేని నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారం ఎప్పటినుంచో చాలా హాట్ టాపిక్ గా మారుతోంది. మొదట ఏంమాయ చేసావే సినిమా షూటింగ్లో నాగచైతన్యతో పరిచయం కాస్త ప్రేమగా మారి ఆ పరిచయాన్ని వివాహం వరకు తీసుకువచ్చారు. అయితే కొన్ని కారణాల చేత గత ఏడాది విడాకులు తీసుకోవడం జరిగింది. అయితే వీరి విడాకులకు గల కారణాలు ఏంటి అనే విషయం ఇప్పటికే హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది. వీరి విడాకుల వ్యవహారంపై కొన్ని విషయాలు మాత్రం ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి వాటి గురించి తెలుసుకుందాం.
అయితే విడాకులు వ్యవహారాన్ని సమంత నాగచైతన్యను అడగగా మా ఇద్దరికీ సరిపడలేదు కాబట్టి విడిపోయామని మాత్రమే తెలియజేస్తూ ఉన్నారు. అయితే సమంత తప్పు చేసిందని పిల్లల్ని కనమంటే కనలేదని ఒక ప్రచారం మాత్రం జరుగుతూ వస్తూ ఉంది. ఇక ఆ తర్వాత ఇతరులతో అఫైర్ పెట్టుకుందని అక్కినేని కుటుంబం చెప్పినట్లు కాకుండా తన అందాల ప్రదర్శన ఎక్కువగా ఉండడంతో ఇలా ఎన్నెన్నో కథలు సమంత విడాకులకు కారణాలని వార్తలు వినిపిస్తూ వచ్చాయి. అయితే ఈ వార్తలపై సమంత కోర్టు వరకు కూడా వెళ్లిందని చెప్పవచ్చు.
అయితే ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. నాగచైతన్య తల్లిని సమంత కలిసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అక్కినేని నాగార్జున, లక్ష్మీ దంపతులకు నాగచైతన్య జన్మించిన సంగతి తెలిసిందే. అయితే లక్ష్మీ విడిపోయి అమెరికాలో నివాసం ఉంటున్నట్లు సమాచారం. అయితే ఇటీవల సర్జరీ కోసమని అమెరికాకు వెళ్లిన సమంత తన అత్తను కలవడానికి వెళ్ళినట్లు ప్రచారం జరుగుతోంది. అక్కడ సమంత పెళ్లి తర్వాత నాగచైతన్య తన టార్చర్ చేసినట్లు ఆమె అందుకు ఆ బాధ తట్టుకోలేక విడాకులు ఇచ్చినట్లుగా తెలియజేసినట్లు టాక్ వినిపిస్తోంది. వివాహానికి ముందు చైతన్య చాలా ప్రేమగా ఉండేవారని.. వివాహం తర్వాత అలా లేరని సమంత, నాగచైతన్య తల్లితో చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయం అక్కినేని కుటుంబానికి తెలిసి కూడా నాగచైతన్యకు సపోర్ట్ చేయడంతో ఇక ఆ బాధ ఎక్కువ రోజులు భరించలేక విడాకులు తీసుకున్నానని లక్ష్మీకి చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది.