అసలు రేమ్యునరేషనే వద్దంటున్నా సాయి పల్లవి.. షాక్ లో నిర్మాతలు..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు పొందింది హీరోయిన్ సాయి పల్లవి. మొదట ఫిదా చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తన మొదటి చిత్రంతోనే ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. సాయి పల్లవి అద్భుతమైన నటనతో డ్యాన్స్ తో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసేలా చేస్తూ ఉంటుంది. సాయి పల్లవి క్రేజ్ ప్రతిరోజు అమాంతం పెరుగుతూనే ఉందని చెప్పవచ్చు. 2008వ సంవత్సరంలో విజయ్ టీవీలో ప్రసారమయ్యే డాన్స్ షోలో సాయి పల్లవి మొదటిసారిగా పాల్గొనింది. ఆ కార్యక్రమం ద్వారానే ఆమెకు పలు సినిమా అవకాశాలు కూడా వచ్చాయట.

I'm afraid my words may be misunderstood, says Sai Pallavi, Sai Pallavi on  row over cow vigilantism remark
ఆ తర్వాత 2015లో నవీన్ ఫలి నటించిన మలయాళ చిత్రం ప్రేమమ్ లో ఒక టీచర్ పాత్రలో సాయి పల్లవి కనిపించింది. ఇక తర్వాత తమిళం, మలయాళం, తెలుగు వంటి భాషలలో కూడా నటించింది. ఇక చివరిగా రానాతో కలిసి విరాటపర్వం, గార్గి తదితర సినిమాలలో నటించింది ఈ రెండు చిత్రాలు పర్వాలేదు అనిపించుకుంది. గతంలో ఒకసారి సాయి పల్లవి ఆమెకు పారితోషకం కూడా అక్కర్లేదని దానితో షూట్ చేద్దామంటూ సాయి పల్లవి చెప్పిన మాటలు ఇప్పుడు చాలా వైరల్ గా మారుతున్నాయి

Sai Pallavi announces her next film 'Gargi' on 30th birthday; unveils  first-look poster | Regional Indian Cinema
చివరిగా గార్గి చిత్రంలో నటించిన సాయి పల్లవి. అయితే ఈ సినిమా పర్వాలేదు అనిపించుకున్న సాయి పల్లవి ధైర్యానికి ఈ సినిమా నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రానికి గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సాయి పల్లవి తో పాటు కాళీ వెంకట్, ఆర్ఎస్ శివాజీ తో సహా పలువురు నటీనటులు సైతం నటించారు. గార్గి సినిమా కథ సాయి పల్లవి నచ్చినప్పుడు.. ఆమె జీతం కూడా ఇవ్వవద్దని తెలియజేసిందట. ఆ డబ్బును సినిమా తీయడానికి పెట్టుబడిగా పెట్టమని చెప్పినట్లు చిత్ర బృందం తెలియజేశారు. అంతేకాకుండా ఈ సినిమా కోసం అడ్వాన్స్ కూడా అవసరం లేదని చెప్పడంతో ఈ విషయం తెలిసిన సినీ ప్రేక్షకులు సినీ తారల సైతం ఏమిపైన ప్రశంసలు కురిపించారు.