సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా తెలుగు సినీ ఇండస్ట్రీలో పేరు పొందాడు డైరెక్టర్ సుకుమార్. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం పుష్ప. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర పలు సంచలనాలు సృష్టించింది. ఈ సినిమా దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకులను సైతం బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు కూడా రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ గా పుష్ప -2 ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇ సినిమా కోసం సినీ ప్రేక్షకులు, అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పుష్ప సినిమా మొదటి భాగం కంటే రెండవ భాగం పైన భారీ అంచనాలు నేలా కోన్నాయి.
ప్రస్తుతం పుష్ప సెకండ్ పార్ట్ సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమా చిత్రీకరణలో రష్మిక కూడా శరవేగంగా పాల్గొంటుంది. అయితే ఈ సినిమా గురించి ప్రతిరోజు ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది ఇప్పటికీ ఈ సినిమాలో సాయి పల్లవి నటించబోతోంది అంటూ వార్తలు వినిపించాయి. ఆ తర్వాత విజయ్ సేతుపతి కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు పలు రూమర్లు కూడా వినిపించాయి అయితే వీటన్నిటికీ చిత్ర బృందం ఇదివరకే క్లారిటీ ఇచ్చింది.
అయితే ఇప్పుడు తాజాగా మరొక అప్డేట్ సినీ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.. ఏమిటంటే ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ అతిధి పాత్రలో కనిపించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ నటుడుతో పలు చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఉందని.. ఈ పాత్ర కోసం ముందుగా విజయ్ సేతుపతిని అనుకోగా చివరి నిమిషంలో అర్జున్ కపూర్ ను ఓకే చేసినట్లు సమాచారం. మరి ఈ వార్తల పైన చిత్ర బృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.