పుష్ప: సినిమాలో అల్లు అర్జున్ కు దీటుగా బాలీవుడ్ హీరో..!!

సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా తెలుగు సినీ ఇండస్ట్రీలో పేరు పొందాడు డైరెక్టర్ సుకుమార్. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం పుష్ప. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర పలు సంచలనాలు సృష్టించింది. ఈ సినిమా దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకులను సైతం బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు కూడా రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ గా పుష్ప -2 ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇ సినిమా కోసం సినీ ప్రేక్షకులు, అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పుష్ప సినిమా మొదటి భాగం కంటే రెండవ భాగం పైన భారీ అంచనాలు నేలా కోన్నాయి.

Allu Arjun-Rashmika Mandanna starrer Pushpa: The Rule commences shooting  with puja | Regional News | Zee News
ప్రస్తుతం పుష్ప సెకండ్ పార్ట్ సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమా చిత్రీకరణలో రష్మిక కూడా శరవేగంగా పాల్గొంటుంది. అయితే ఈ సినిమా గురించి ప్రతిరోజు ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది ఇప్పటికీ ఈ సినిమాలో సాయి పల్లవి నటించబోతోంది అంటూ వార్తలు వినిపించాయి. ఆ తర్వాత విజయ్ సేతుపతి కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు పలు రూమర్లు కూడా వినిపించాయి అయితే వీటన్నిటికీ చిత్ర బృందం ఇదివరకే క్లారిటీ ఇచ్చింది.

Allu Arjun Thanks Arjun Kapoor And Pens Down THIS Message For The Actor
అయితే ఇప్పుడు తాజాగా మరొక అప్డేట్ సినీ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.. ఏమిటంటే ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ అతిధి పాత్రలో కనిపించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ నటుడుతో పలు చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఉందని.. ఈ పాత్ర కోసం ముందుగా విజయ్ సేతుపతిని అనుకోగా చివరి నిమిషంలో అర్జున్ కపూర్ ను ఓకే చేసినట్లు సమాచారం. మరి ఈ వార్తల పైన చిత్ర బృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.