తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా డాన్స్ మాస్టర్ గా తన కెరీర్ ని మొదలుపెట్టి ప్రస్తుతం స్టార్ హీరోలకు కూడా కొరియోగ్రాఫర్ గా చేస్తూ టాప్ పొజిషన్ లో ఉన్నారు శేఖర్ మాస్టర్. ఒకవైపు సినిమాలలో డాన్స్ కంపోజ్ చేస్తూ మరొకవైపు బుల్లితెర పైన పలుషోలకు జడ్జిగా వ్యవహరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ షో కు జడ్జిగా వ్యవహరించడం ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు శేఖర్ మాస్టర్.ఆ తర్వాత జబర్దస్త్ వంటి షోలకు కూడా జడ్జిగా వ్యవహరించారు. ప్రస్తుతం ఈటీవీ నుంచి వెళ్లిపోయి స్టార్ మాలో పలు కామెడీ షోలకు కూడా జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తాజాగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు వాటి గురించి చూద్దాం.
ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ షోలో మొదట కనిపిస్తే తన కెరియర్ మొదలైందని ఆ తర్వాత డ్యాన్స్ మాస్టర్ గా అవకాశాలు రాకపోవడంతో గ్రూప్ డాన్సర్ గా ఉన్న సమయంలోనే ఈ షోలో పాల్గొన్నానని తెలిపారు. మొదటిసారి విన్నర్ అవ్వకపోవడంతో కాస్త నిరాశ చెందానని మళ్లీ ఢీ ఐదో సీజన్లో పాల్గొని విజేతగా నిలిచానని శేఖర్ మాస్టర్ తెలిపారు. మొదట సుధీర్ బాబు హీరోగా నటించిన SMS సినిమా లో తనకి అవకాశం వచ్చిందని ఆ తర్వాత జులాయి సినిమాలో తన కెరియర్ ఊబందుకుందని తెలిపారు. ఇక అడ్డు తరువాతే తను పార్టిసిపెంట్ చేసిన షో లోని జడ్జిగా వచ్చానని తెలిపారు. ప్రస్తుతం ఆషో నుంచి తప్పుకోవడానికి గల కారణాలు తెలియజేశారు.
ఓంకార్ తో తనకి మంచి అనుబంధం ఉండడం వల్ల ఆయన అడిగారని కామెడీ స్టాక్స్ కి జడ్జిగా వెళ్లాను అయితే ఢీ వాళ్లను అడిగాను ఇది డాన్స్ షో అదొక కామెడీ షో కాబట్టి సమస్య లేదు వెళ్ళమన్నారు.. కానీ ఆ తర్వాత కొద్ది రోజులకు చిన్న ఇష్యూ వల్ల మాటీవీలో మానేసి వచ్చేయమని అడగడంతో మాటిచ్చా ఎలా మధ్యలో వచ్చేయడం అని ఆలోచించి ఢీ నుంచి తప్పుకున్నానని తెలియజేశారు శేఖర్ మాస్టర్. అయితే మళ్లీ మల్లెమాలవారు రమ్మన్నారు కానీ ఇంకా ఆలోచించలేదని తెలిపారు శేఖర్ మాస్టర్.