Jr NTRపై విరుచుకుపడిన ముసలవ్వ… నువ్వు ఉంటే ఏమీ చస్తే ఏమి అంటూ తిట్ల పురాణం!

నిన్నటినుండి నందమూరి అభిమానులు, ముఖ్యంగా Jr Ntr అభిమానులు ఒక ముసలామెపై గుర్రుగా వున్నారు. విషయం ఏమంటే, ఆమె ఎన్టీఆర్ పైన తన తిట్ల పురాణంతో విరుచుకుపడింది. ఇంతవరకు ఎన్టీఆర్ ను అలా ఎవరూ తిట్టి ఉండరేమో. పైగా చూస్తుండగానే నడి రోడ్డుపై మైక్ లో తిడుతూ తెచ్చిపోయింది. కాగా దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రీసెంట్ గా ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై పెద్ద రచ్చ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే.

ఇక్కడే వచ్చింది అసలు చిక్కు. ఈ విషయమై జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన రియాక్షన్ చాలామంది నందమూరి అభిమానులకు కాస్త వెటకారంగా అనిపించింది. దీంతో సోషల్ మీడియాలో నిన్న మొన్నటివరకు ఎన్టీఆర్ పై ట్రోలింగ్ నడిచింది. కాగా ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పుపై తారక్ స్పందించిన తీరును తాజాగా ఓ ముసలవ్వ తప్పు బట్టింది. ఈ సందర్భంగా ఏపీలో అమ‌రావ‌తి రాజ‌ధాని సాధన కోసం రైతులు మహా పాదయాత్ర నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని ఈ ముసలమ్మ వాడుకుంది.

ఈ సమయంలో ఓ రిపోర్టర్ ఆమెని పలకరించగా.. మైక్ దొరికింది కదాని దొరికిందే చాన్సు అనుకొని ఆ బామ్మ జూనియ‌ర్ ఎన్టీఆర్‌ పై విరుచుకుపడింది. ఆమె మాట్లాడుతూ… “ఎన్టీఆర్ మ‌న‌వ‌డిన‌ని చెప్పుకొని తిరుగుతున్నాడు. ఎందుకు ఈ ఎన్టీఆర్ మ‌న‌వ‌డు. ఎన్టీఆర్ మ‌న‌వ‌డివి అయితే ముందుకు రా! నీ తాత‌ను అవ‌మానించిన‌ప్పుడు ఇంకా నువ్వెందుకురా” అంటూ రెచ్చిపోయింది. అక్కడితో ఆగకుండా “నువ్వు ఉంటే ఏమీ చ‌స్తే ఏమి… మా TDPని మేమే లాక్కొచ్చుకుంటాం” అంటూ ఊగిపోయింది. కాగా దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.