పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో.. రామ్ పోతినేని హీరోగా వచ్చిన మాస్ ఎంటర్టైన్మెంట్ చిత్రం ఇస్మార్ట్ శంకర్ . ఈ సినిమా ద్వారా నిధి అగర్వాల్ కు మంచి గుర్తింపు లభించింది. ఇక ఈ సినిమా విజయం ఈమెకు మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతుందని అందరూ అనుకున్నారు. కానీ అనుకున్నట్టుగా ఈమెకు అవకాశాలు రాలేదు దీంతో సోషల్ మీడియాలో బిజీగా ఉంటూ తన గ్లామర్ ఫోటోస్ తో నిత్యం అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఇక ఈ క్రమంలోనే తన ఇంస్టాగ్రామ్ లో మెసేజ్ తో అందరికీ షాక్ ఇచ్చింది. ఇంతకీ నిధి అగర్వాల్ ఏం చెబుతోంది అంటే వస్తువులను వాడుకోండి కానీ మనుషులను కాదు.. మనుషులను ప్రేమించండి కానీ వస్తువులను కాదు.. అంటూ ఇంగ్లీషులో ఒక కొటేషన్ పెట్టింది. అసలు నిధి అగర్వాల్ కు ఏమైంది? ఎందుకు ఈ కొటేషన్ షేర్ చేసింది? అనే విషయంలో నెటిజన్స్ సైతం ఆరా తీస్తున్నారు.
ఇక ఈ క్రమంలోనే తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ . తాజాగా హరిహర వీరమల్లు సినిమా లో చేసిన నిధి అగర్వాల్ ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తోంది. ఇకపోతే తమిళంలో మాత్రం ఈమెకు వరుస సినిమాలలో అవకాశాలు లభిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలి అంటే తెలుగుతో పోల్చుకుంటే ఈమెకు తమిళంలో మంచి క్రేజ్ ఏర్పడిందని చెప్పవచ్చు. అయితే మరి ఎందుకు నిధి అగర్వాల్ ఇంతలా హర్ట్ అయింది అన్నది మాత్రం బయటకు రావాల్సి ఉంది. ఒకవేళ నిధికి కూడా పర్సనల్గా అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా జరిగిందా అని కూడా అనుకుంటున్నారు.
ఏమైనా నిధి అగర్వాల్ తన స్టేటస్ లో పెట్టుకున్న ఈ మెసేజ్ గురించి ఇప్పుడు అందరూ చర్చించుకుంటూ ఉండటం గమనార్హం. ఇకపోతే సోషల్ మీడియా వేదికగా హాట్ షోస్ తో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇంస్టాగ్రామ్ లో ఈమెకు లక్షల మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు.