సినిమా ఇండస్ట్రీలో రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సీనియర్ హీరో కృష్ణంరాజు నట వారసుడిగా ప్రభాస్ ని సినీ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేశారు . అయితే ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్.. ప్రజెంట్ పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు తీసుకుంటూ ..దాదాపు ఒక్కో సినిమాకి 120 నుంచి 150 కోట్లు అందుకుంటున్నాడు. ఇది నిజంగా తెలుగు జనాలు గర్వించదగ్గ విషయం.
తెలుగు హీరో బాలీవుడ్ కి వెళ్లి అక్కడ ఇలాంటి స్టార్ స్టేటస్ సంపాదించుకొని ఇంతటి రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు అంటే అది మామూలు విషయం కాదు. కాగా ప్రభాస్ కి ఈ రేంజ్ పాపులారిటీ పబ్లిసిటీ రావడానికి మెయిన్ కారణం బాహుబలి సిరీస్. ఎస్ ఈ విషయం అందరికీ తెలిసిందే . బాహుబలి సినిమా ఒకవేళ ప్రభాస్ చేయకుండా ఉంటే ఈ క్రేజ్ ఈ రేంజ్ కచ్చితంగా రాదని చెప్పాలి. బాహుబలి 1 బాహుబలి 2 చిత్రాలతో జాతీయస్థాయినటుడుగా ఎదిగాడు ఈ రెబల్ హీరో.
కాగా ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు అన్ని పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కుతున్నాయి. ఒక్క మారుతి డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా తప్పిస్తే మిగతావన్నీ పాన్ ఇండియా రేంజ్ లోనే వస్తున్నాయి. రీసెంట్ గానే ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు గారు అనారోగ్య కారణంగా మరణించారు. ఆ బాధల నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా ప్రభాస్ మళ్లీ సినిమా షూటింగ్స్ కి అటెండ్ అవుతున్నాడు .
కాగా రీసెంట్గా మారుతి డైరెక్షన్ లో రాబోతున్న రాజా డిలాక్స్ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు ప్రభాస్. ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న అషిక రంగనాథ్ కి రెబెల్ ఫ్యామిలీ ఆహార పదార్థాలను రుచి చూపించాడు. ఆమె కోసం స్పెషల్ గా ఇంటి నుంచి క్యారియర్ పంపించి సర్ప్రైజ్ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్ వైరల్ గా మారింది.
#Prabhas Sent Hyderabad food for @AshikaRanganath ! ❤️ #RajaDeluxe pic.twitter.com/rLT6rRqFb0
— v🔑 (@charanvicky_) October 27, 2022