తెలుగు సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమాలు చేయడానికి ఎంతో మంది హీరోలు సైతం ఎక్కువ మక్కువ చూపించేవారు.కానీ ఈ మధ్యకాలంలో పూరి జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రాలు అన్ని డిజాస్టర్ కావడంతో పూరి జగన్నాథ్ తో సినిమాలంటే భయపడుతున్నారు నటీనటులు. ఇక విజయ్ దేవరకొండ తో చివరిగా తెరకెక్కించిన లైగర్ సినిమా భారీ డిజాస్టర్ కావడంతో అటు విజయ్ దేవరకొండ కెరియర్ పూరి జగన్నాథ్ కెరియర్ చాలా ఇబ్బందుల్లో పడిందని చెప్పవచ్చు. అంతేకాకుండా లైగర్ సినిమా కంటే ముందు వీరిద్దరి కాంబినేషన్లో జనగణమన చిత్రం కూడా షూటింగ్ జరుపుకుంది.
జనగణమన చిత్రం పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఎన్నోసార్లు తెలియజేశారు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కించి పాన్ ఇండియా డైరెక్టర్గా పేరు పొందాలని ప్రయత్నాలు చేశారు. కానీ లైగర్ సినిమా ఫ్లాప్ కావడంతో ఈ చిత్రం షూటింగ్ కూడా నిలిచిపోయింది. అంతేకాకుండా ప్రస్తుతం ఈ సినిమాని విజయ్ దేవరకొండ తో కాకుండా ఇతర హీరోలతో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు పూరి జగన్నాథ్. బాలీవుడ్ హీరోలలో ఒకరైన రణవీర్ సింగ్, విక్కీ కౌశల్ తో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అంతేకాకుండా పూరి జగన్నాథ్ గడచిన మూడు సంవత్సరాల నుంచి ముంబైలోనే ఉంటున్నారు.
అయితే డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన పూరి జగన్నాథ్ ఈ సినిమా మొదట మహేష్ బాబుతో తెరకెక్కించాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల చేత ఈ చిత్రాన్ని తెరకెక్కించలేకపోయారు. అయితే ఇప్పుడు కొంతమంది క్రిటిక్స్ తెలియజేస్తున్న ప్రకారం.. ఈ సినిమా మహేష్ బాబుకు మాత్రమే సెట్ అవుతుందని అందుచేతనే ఈ సినిమాకి ఇన్ని అడ్డంకులు వస్తున్నాయని వారి భావనగా తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా జనగణమన చిత్రానికి మహేష్ బాబు శాపం తగిలిందని పలువురు నెటిజెన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి పూరి మనసు మార్చుకొని మహేష్ బాబుతో ఈ సినిమా చేస్తారేమో చూడాలి.