మనం రోజు చూస్తున్న బుల్లితెర సీరియల్ హీరోస్ చాలామంది పేర్లు మనకు తెలియదు. అంతేకాకుండా వారు ఎంతవరకు చదువుకున్నారు అనేది కూడా మనకు తెలియదు. జనరల్ గా చదులు పెద్ద గా లేని వాళ్లే ఇలా సీరియల్స్ చేస్తుంటారు అనుకుంటాం కానీ అది తప్పు. మన తెలుగు బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్ లో ఉన్న హీరోలు చదువులో కింగ్ లు. వాళ్లి ఎవరు ఎంతవరకు చదువుకున్నారు అనేది ఇప్పుడు చూద్దాం..!!
ఈటీవీలో వచ్చే ‘అభిషేకం’ సీరియల్ లో హీరో మధు బీటెక్ వరకు చదువుకున్నారు. ‘కార్తీకదీపం’ సీరియల్ లో ఉన్న హీరో నిరుపమ్ ఎంబీఏ వరకు చదువుకున్నాడు. జీ తెలుగులో వచ్చే ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్ లో ఉన్న హీరో శ్రీరామ్ బీఎస్సీ వరకు చదువుకున్నాడు.
‘బిగ్ బాస్ 5’ విన్నర్ విజే సన్నీ.. బి ఎస్ సి వరకు చదువుకున్నాడు. జీ తెలుగులో వచ్చే ‘త్రినయిని’ సీరియల్ హీరో చందు బీటెక్ వరకు చదువుకున్నాడు. ‘గుండమ్మ కథ సీరియల్’ లో హీరో కల్కి ఎంబీఏ వరకు చదువుకున్నాడు. ‘దేవత’ సీరియల్ లో హీరో అర్జున్ ఎంసీఏ వరకు చదువుకున్నాడు. మరో సీరియల్ ‘రాధమ్మ కూతురు’ హీరో గోకుల్ బీటెక్ వరకు చదువుకున్నాడు.
స్టార్ మా లో వచ్చే ‘పాపే మా జీవనజ్యోతి’ సీరియల్ హీరో ప్రీతం చరణ్ బీటెక్ సీఎస్ఈ వరకు చదువుకున్నాడు. జీ తెలుగులో వచ్చే మరో సీరియల్ ‘నెంబర్ వన్ కోడలు’ హీరో జై ధనుష్ బి ఏ వరకు చదివాడు. స్టార్ మా లో వచ్చే ‘ఇంటికి దీపం ఈల్లాలు’ సీరియల్ హీరో శివకుమార్ బీటెక్ వరకు చదివాడు. ‘ఆమె కథ’ సీరియల్ హీరో రవి కృష్ణ డిగ్రీ వరకు చదివాడు. ‘కలిసి ఉంటే కలదు సుఖం’ హీరో నిఖిల్ డిగ్రీ వరకు చదువుకున్నాడు. మన బుల్లితెరపై కనిపించే స్టార్ హీరోలు చదివిన చదువులు ఇవి.