సినీ ఇండస్ట్రీలో ఉండే నటీనటులు అయినా సాధారణ ప్రేక్షకులైనా సరే ఖచ్చితంగా దైవభక్తి అనేది ఉండనే ఉంటుంది. అయితే తాజాగా ఒక స్టార్ హీరోయిన్ గంగానది తీరాన మొక్కులు చెల్లిస్తూ ఉండేటువంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే ఆమె ఒక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తనదైన అందంతో అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది. ముఖ్యంగా షారుఖ్, సల్మాన్, అమీర్ ఖాన్ తదితర స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.
ఈ ముద్దుగుమ్మ కేవలం హీరోయిన్ గా కాకుండానే పలు చిత్రాలలో వెబ్ సిరీస్లలో నటిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా కూడా పేరు సంపాదిస్తోంది.సినిమాలు చేస్తున్న సమయంలో ఒక స్టార్ క్రికెటర్ను ప్రేమించి వివాహం చేసుకుంది. ప్రస్తుతం వీరిద్దరికీ ఒక ఆడబిడ్డ కూడా జన్మించింది. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఒక స్పోర్ట్స్ బయోపిక్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఒకవైపు సినిమాలు మరొకవైపు తన కూతురి ఆలనాపాలన చూసుకుంటూ తెగ మురిసిపోతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈమె మరెవరో కాదు ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ.
ఒక సినిమా పనిమీద కోల్కత్తాకు వెళ్లిన అనుష్క తన టూర్ కు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గంగమ్మకు మొక్కులు చెల్లించేందుకు అనుష్క తన కూతురుతో కలిసి వెళ్లినట్లుగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అనుష్క శర్మకు సంబంధించిన ఫోటోషూట్లను కూడా అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. ఇటీవల అనుష్క శర్మాన్ని చూసిన అభిమానుల సైతం ఆశ్చర్యపోతున్నారు.
View this post on Instagram