సినిమా హీరోలు డబ్బులు బాగా సంపాదించాలి అంటే పలు రకాల వాటినే ఎంచుకుంటూ ఉంటారు. కొంతమంది వ్యాపారాలు, థియేటర్లు నిర్మించడం, సొంత బ్యానర్, యాడ్స్ తదితర వంటివి చేస్తూ ఉంటారు. ఎక్కువమంది పలు రకాల యాడ్స్ లో నటించి భారీ మొత్తంలోనే సంపాదిస్తూ ఉంటారు. మరి కొంతమంది కేవలం ప్రజల గురించి ఆలోచించి ఆ యాడ్స్ ల ద్వారా ఎలాంటి హాని కలగకుంటేనే నటిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎన్నో ఆఫర్లు వచ్చినా..డబ్బులకు కకృతి పడకుండా రిజెక్ట్ చేసిన హీరోలు చాలామంది ఉన్నారని చెప్పవచ్చు. ఈ లిస్టులో బాలకృష్ణ మొదటి వరుసలో ఉంటారు.
బాలకృష్ణ తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాణిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పలు వ్యాపారాల ప్రకటనల్లో నటించమని ఆఫర్లు వచ్చినా.. వాటిని రిజెక్ట్ చేస్తూ వచ్చారు. అంతేకాదు కోట్ల రూపాయల పారితోషకం ఆశగా చూపించిన సరే ప్రజలకు ఇబ్బంది కలిగే విషయం అయితే ఆయన కచ్చితంగా నటించనని ఖరాకండిగా చెప్పిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే ఇదిలా ఉండగా బాలకృష్ణ తన కెరియర్లో మొదటిసారి ఒక వ్యాపార ప్రకటనలో నటించారు. గతంలో ఎన్నో ఆఫర్లు వచ్చినప్పటికీ రిజెక్ట్ చేసిన బాలయ్య తాజాగా సాయి ప్రియ కన్స్ట్రక్షన్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ కోసం టీవీ యాడ్ లో నటించారు. ఇప్పుడు ఈ ప్రకటనకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది.
మొదటిసారి బాలయ్య బాబు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుండడంతో ఆయన రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారు అనే విషయం ప్రస్తుతం టాలీవుడ్ లోనూ అటు ప్రేక్షకులలో కూడా హాట్ టాపిక్ గా మారింది. కానీ తాజాగా అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బాలకృష్ణ ఈ టీవీ యాడ్ కోసం ఏకంగా 16 కోట్ల రూపాయల పారితోషకం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బాలకృష్ణ ఆ యాడ్ లో నటించడం ద్వారా వచ్చిన డబ్బును సైతం తన సొంత అవసరాల కోసం ఉపయోగించుకోవడం లేదు అని, ఆ డబ్బులను తన తండ్రి నిర్మించిన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి డొనేట్ చేసినట్లు సమాచారం. ఈ విషయం తెలియడంతో బాలయ్య అభిమానులు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.