త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం అల వైకుంఠపురంలో.. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా పూజా హెగ్డే కి బుట్ట బొమ్మగా మంచి గుర్తింపును కూడా తీసుకొచ్చింది. ఇక ఈ సినిమాతోనే ఈమె ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయిందని చెప్పవచ్చు. ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె పాన్ ఇండియా హీరోయిన్గా కూడా చలామణి అవుతుంది .ఇక ప్రస్తుతం ఈమె నటించినా అన్ని సినిమాలు ఇప్పటివరకు మంచి విజయాన్ని సాధించాయి. కానీ గత కొన్ని రోజుల నుంచి ఈమె నటిస్తున్న సినిమాలు వరుసగా డిజాస్టర్ మూట కట్టుకుంటూ ఉన్నప్పటికీ అవకాశాలు మాత్రం వెతుక్కుంటూ రావడం గమనార్హం.
ఇకపోతే 2018 నుంచి ఈ ఏడాది రెండు భారీ ప్రాజెక్టులతో స్టార్ హీరోలతో నటిస్తూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన ఈ ముద్దుగుమ్మ హిందీలో కూడా బాగా పాపులారిటీని సంపాదించుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం ఈమె చేతిలో రణవీర్ తో కలిసి సర్కస్ , సల్మాన్ ఖాన్ తో కలిసి కిసీ కా భాయ్ కిసీ కా జాన్ వంటి క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తోంది. ఇక ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో నటిస్తోంది. ఇకపోతే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రారంభమైంది. ఇకపోతే ఫైట్ మాస్టర్ అన్బు , అరివు , మహేష్ కొంతమంది ఫైటర్స్ పాల్గొనగా హై వోల్టేజ్ యాక్షన్ సీన్లను కూడా రూపొందించారు.
ఇదిలా ఉండగా గత కొన్ని రోజుల నుంచి పూజా హెగ్డే కాస్మెటిక్ సర్జరీ చేయించుకోవడానికి లండన్ వెళ్లిందని సోషల్ మీడియాలో పుకార్లు మొదలయ్యాయి. అంతేకాదు ఆమె ముక్కు అలాగే పెదాలకు సర్జరీ చేయించుకుందని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ విషయాలపై తాజాగా పూజా హెగ్డే సన్నిహిత వర్గాలు క్లారిటీ ఇవ్వడం జరిగింది. తాను ఆగస్టులో వెకేషన్ కి వెళ్లి వచ్చిందని తనకు ఎలాంటి సర్జరీ జరగలేదని అవన్నీ అసత్య రూమర్స్ అంటూ కొట్టి పారేశారు. ఇక ప్రస్తుతం ఈమె హైదరాబాదులోనే ఉంటున్నట్లు సమాచారం.