టాలీవుడ్ లో తొట్టెంపూడి వేణు తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. మొదట స్వయంవరం చిత్రంతో హీరోగా పరిచయమైన వేణు తన మొదటి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక తర్వాత మరికొన్ని చిత్రాలలో హీరోగా నటించిన అంతగా సక్సెస్ కాలేకపోయారు. కానీ వేరొక నటుడుగా మంచి గుర్తింపు తెచ్చిన చిత్రాలతో హనుమాన్ జంక్షన్, పెళ్ళాం ఊరెళితే వంటి చిత్రాలతో ప్రేక్షకులను బాగా మెప్పించారు. ఇక తర్వాత పలు సినిమాలకు నటించకుండా ఇండస్ట్రీకి దూరమయ్యారు.
తాజాగా వేణు రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ చిత్రంతో రియంట్రీ ఇచ్చారు. ఇది కూడా పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. ఇక గతంలో కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అది కూడా పెద్దగా రాబట్టలేకపోయారు. ఇక వేణుకు రాజకీయ బ్యాగ్రౌండ్ కూడా బాగానే ఉంది. ఖమ్మం ఎంపీ నాయా నాగేశ్వరరావు వేణుకు స్వయాన బావ అవుతారు. ఇక వేణు చెల్లెలిని నాయా వివాహం చేసుకున్నారు. అంతేకాకుండా ప్రముఖ దర్శకుడు వి గోపాల్ వేణుకు స్వయాన మేనమామ అవుతారు. అంతేకాకుండా బాలకృష్ణ సైతం వేణుకి దగ్గర బంధు అన్న సంగతి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.
ఇక మాజీ కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు నటుడు వేణుకు పెద్దనాన్న అవుతారు. కావూరి సాంబశివరావు కూతురు కొడుకు మెతుకు మిల్లి శ్రీ భరత్ బాలకృష్ణ చిన్న కుమార్తెను వివాహం చేసుకోవడం జరిగిందట. అయితే వేణు సోదరి కుమారుడిని బాలయ్య చిన్న కూతురు వివాహం చేసిందని చెప్పవచ్చు. ఆ ప్రకారంగా బాలకృష్ణ ,వేణుకు అన్నయ్య అవుతారు. ఇక వేణు కూడా నందమూరి కుటుంబంకు చాలా దగ్గర బంధువు అని చెప్పవచ్చు. అయితే వేణు మాత్రం ఎప్పుడూ కూడా ఈ విషయాలను తెలియజేయలేదు. కానీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ బాలకృష్ణ పై పొగడ్తలు కురిపించడంతో ఈ విషయం బయటికి రావడం జరిగింది.