టాలీవుడ్ సినీ స్టార్ డైరెక్టర్ రేలంగి నరసింహారావు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన ఎన్నో కామెడీ సినిమాలకు దర్శకత్వం వహించి, తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అంతేకాకుండా కొన్ని ప్రేమకథా చిత్రాలను కూడా తెరకెక్కించి మంచి విజయాలను సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఎక్కువగా రాజేంద్రప్రసాధ్ సినిమాలకు దర్శకత్వం వహించి ఆయనకు కూడా మంచి గుర్తింపును అందించారు అని చెప్పవచ్చు. ఇకపోతే ఈయన కేఎస్ఆర్ దాస్, దాసరి నారాయణ రావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ఇదిలా ఉండగా ఒకసారి తన గురువు దాసరి మీదనే దండయాత్ర చేశారు రేలంగి నరసింహారావు.
ఇక ఆయన ఒకసారి ఒక ప్రోగ్రాం కి హాజరైనప్పుడు అసలు విషయాన్నీ బయట పెట్టాడు. తన గురువుగారు దాసరి తన క్లాపు బోర్డును నేల మీద పెట్టినందుకు.. తనను గట్టిగా కొట్టాడట. ఇక ఈయనను దాసరి నారాయణరావు ఒక మాట అనడంతో ఆయన రెండు గంటల వరకు అక్కడ నుంచి కదల లేదట. ఇక ఆ విషయాన్ని యాంకర్ అడిగినప్పుడు అనుకోకుండా జరిగిందని తెలిపాడు రేలంగి. ఇక ఈ విషయంలో కోపం వచ్చిందట. కాక పెట్టే వాళ్ళందరిని ముందు వరుసలో పెట్టాడు అన్న అజ్ఞానంతో.. వద్దు ఈయన దగ్గర మానేద్దామని అనుకున్నాడట రేలంగి.. ఇక ఈ విషయాన్ని దాసరి దగ్గరికి వెళ్లి చెప్పాలని వెళ్ళాడట. ఇక ఆయన మొహం చూడకుండా ఆయన పాదాల దగ్గరకు వెళ్లి గురువుగారు ఎక్కడున్నా కూడా మీ శిష్యుడినే..మీ పేరు నిలబెడతానని.. వస్తాను సార్ అని అన్నప్పుడు తన కళ్ళల్లో నుంచి రెండు కన్నీటి చుక్కలు పడ్డాయట.
అయితే అలా కన్నీళ్లు పడ్డాయని తనకు కూడా తెలియదట. ఇక తన రూమ్ కి వెళ్లి బాధపడుతూ పడుకున్నాడట రేలంగి. తర్వాత ఒక హారన్ సౌండ్ రావడంతో చూసేసరికి ఒక ప్రొడ్యూసర్ .. రేలంగి దగ్గరకు వచ్చి ఏంటి దాసరి నారాయణ రావు మీద దండయాత్ర చేశావట కదా అని అన్నాడు. దాంతో ఆయన ఎంత సార్ ఆయనతో నేనెందుకు దండయాత్ర చేస్తాను అని అన్నాడట రేలంగి. ఇక తర్వాత ఆ ప్రొడ్యూసర్ నువ్వు వెళ్లినప్పటి నుంచి దాసరి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టలేదు అనడంతో అటువంటి వ్యక్తిని వదులుకోవడం కరెక్ట్ కాదని వెళ్ళగానే తనను చూసి ఆనందంతో కడుపునిండా భోజనం చేశారట దాసరి.