తెలుగు బుల్లితెరపై ప్రేక్షకులకు అనితా చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు సీరియల్స్ లో నటించి బాగా పాపులర్ అయింది. అలాంటి పాపులర్ తోనే కొన్ని సినిమాలలో హీరో హీరోయిన్లకు మదర్ క్యారెక్టర్ లో కూడా నటించింది.. మొదట ఈటీవీలో ఇమే యాంకర్ గా చేసింది. ఇక తర్వాత బ్రహ్మానందం ఇంటర్వ్యూ చేయడంతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది అనిత చౌదరి.
ఇక బుల్లితెర పైన విషయానికి వస్తే కస్తూరి సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న అనిత చౌదరి ఆ సీరియల్ ద్వారా ఆమె పేరు కంటే ఆమె నటించిన కస్తూరి పేరు చాలామందికి గుర్తుండిపోయేలా నటించింది. తాజాగా కస్తూరి ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తనకు సంబంధించిన కొన్ని విషయాలను తెలియజేసింది. కస్తూరి సీరియల్స్ ఏడేళ్ల పాటు కొనసాగింది ఆ సమయంలో అబ్బాయిలు మాత్రమే కాదు అమ్మాయిలు కూడా తనని ప్రేమించారని తెలియజేసింది. ఇక అంతే కాకుండా తాను చదవ లేనన్ని ఉత్తరాలు కూడా వచ్చేవని తెలియజేసింది. కొంతమంది భర్తలు అయితే ఏకంగా తమ భార్యలు తమకి అన్నం పెట్టలేదని ఫిర్యాదులు కూడా చేశారట. అంతటి అభిమానాన్ని సొంతం చేసుకున్నానని తెలియజేసింది అనిత చౌదరి.
అలా నెమ్మదిగా బుల్లితెర ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోవడంతో పలు సీరియల్స్ లో కూడా అవకాశాలు వచ్చాయని. అలా వెండితెర పైన కూడా కొన్ని అవకాశాలు వచ్చాయని తెలియజేసింది. ముఖ్యంగా ప్రభాస్ నటించిన చత్రపతి సినిమాలో సూరిడు ఏడున్నావ్ రా అన్న డైలాగ్ బాగా పాపులర్ అయ్యిందని తెలిపింది. అటు వెండితెరపై ఇటు బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న నటిగానే కాకుండా యాంకర్ గా కూడా బాగా పేరు సంపాదించింది అనితా చౌదరి.