ఎన్టీఆర్ -30 వ సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని అభిమానులు సైతం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాకి త్వరలోనే షూటింగ్ ఏర్పాటు చేస్తున్నారని వార్తలు కూడా తెలుగు ఇండస్ట్రీలో బాగా వార్తలు వినిపిస్తున్నాయి. స్క్రిప్ట్ విషయంలో కాస్త ఎక్కువ సమయం తీసుకున్న కొరటాల శివ ఆ వెంటనే ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా వచ్చే యేడాది సమ్మర్లో విడుదల చేసేందుకు చిత్ర బృందం సైతం పలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్ల విషయంలో మాత్రం ఇప్పటికీ ఇంకా సస్పెన్స్ గానే ఉన్నదని చెప్పవచ్చు.
మొదట ఈ సినిమాలో ఆలియా భట్ హీరోయిన్గా నటించబోతుందని వార్తలు వినిపించాయి.. ఆ తర్వాత జాన్వీ కపూర్, రష్మిక తదితర పేర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు తాజాగా సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాగూర్ పేరు కూడా బాగా వినిపిస్తోంది. వీరిద్దరిలో ఎవరు హీరోయిన్ అనే విషయంలో మాత్రం ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇప్పటికే రష్మిక పుష్ప సినిమాలో నటించి పాన్ ఇండియా హీరోయిన్ గా పేరుపొందింది. ఇక సీతారామం సినిమా ముందు వరకు మృణాల్ బాలీవుడ్ లో కూడా బాగానే పేరు సంపాదించింది.
దీంతో ఈ ఇద్దరిలో ఎవరిని తీసుకోవాలో సతమతంలో యూనిట్ సభ్యులు ఉన్నట్లుగా సమాచారం. ఎన్టీఆర్ 30 లో సీతారామం సినిమాలో నటించిన ఈ ఇద్దరు ముద్దుగుమ్మలలో ఎవరో ఒకరిని కన్ఫర్మ్ చేయడం ఖాయమన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కొంతమంది మాత్రం ఎన్టీఆర్కు జోడిగా మృణాల్ ఠాగూర్ అయితే బాగుంటుందని తెలియజేస్తున్నారు. మరి కొందరు మాత్రం రష్మిక అయితే బాగుంటుందని అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. మరి ఎన్టీఆర్ 30వ సినిమా యొక్క హీరోయిన్స్ సస్పెన్షన్ పై ఎప్పుడు క్లారిటీ వస్తుందో అంటూ అభిమానులు నిరుత్సాహంతో ఉన్నారు. డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాపై వస్తున్న వార్తలు పై క్లారిటీ ఇస్తే బాగుంటుంది.