బుల్లితెరపై ప్రసారమవుతున్న రియాల్టీ షోలో బిగ్ బాస్ కూడా ఒకటి అని చెప్పవచ్చు. ఇందుకోసం ఎంతమంది ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తూ ఉండేవారు. అయితే గడిచిన 5 సీజన్లు బాగా విజయవంతంగా కొనసాగాయి. అయితే ఇప్పుడు ఆరో సీజన్ కి కాస్త డల్ గా ఉండడంతో ప్రేక్షకులు సైతం బిగ్ బాస్ షోను చూడడానికి అంతగా ఇష్టపడలేదు. ముఖ్యంగా కంటిస్టేంట్లను మార్చమని పలు రకాలుగా కామెంట్ చేస్తూ ఉన్నారు. అయితే బిగ్ బాస్ షో కి మొదటి నుంచి జబర్దస్త్ కమెడియన్లకి ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. అయితే కొంతమంది మాత్రం వెళ్లడానికి ఇష్టపడినా మరికొంతమంది ఆసక్తి చూపలేదు.
జబర్దస్త్ ద్వారా ఎవరు ఊహించని విధంగా మంచి పాపులర్ సంపాదించుకున్న కమెడియన్లలో కమెడియన్ అప్పారావు కూడా ఒకరు . ఈయన ఎన్నో సినిమాలలో కూడా నటించారు. తాజాగా ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో అప్పారావు పలు విషయాలను తెలియజేశారు. వాటి గురించి తెలుసుకుందాం. అప్పారావు మాట్లాడుతూ.. జబర్దస్త్ లో నాగబాబు గారు వెళ్లిన సమయంలో జబర్దస్త్ రేటింగ్ చాలా పడిపోయింది అని తెలిపారు. ఇక ఆయన వెళ్లారని బాధతో ప్రతి ఒక్కరు కూడా ఉన్నామని ఆ సమయంలోనే రోజా గారు అందరిని ఎంతో సపోర్ట్ చేశారని తెలిపారు.
ఇక అలాంటి సమయంలోనే అప్పారావు బిగ్ బాస్ షో కి వెళ్తున్నారని ప్రచారం చేశారని తెలిపారు.అయితే జబర్దస్త్ లో ఉన్నప్పటి కంటే ఇప్పుడు చాలా హ్యాపీగానే ఉన్నానని చెప్పుకొచ్చారు.. ఎక్కడికి వెళ్లినా తనని తన భార్యని బాగా పలకరిస్తూ ఉంటారని తెలిపారు. ముఖ్యంగా జబర్దస్త్ షోలో మూడుసార్లు పాల్గొనేందుకు అవకాశం వచ్చిందని అయితే అగ్రిమెంట్లు ఉండడం వల్ల నేను వెళ్ళలేకపోయాను అని తెలిపారు. ఇక ఒక జబర్దస్త్ కళాకారుడిని బిగ్ బాస్ హౌస్ లోకి ఎలాంటి డబ్బులు తీసుకోకుండా పంపిస్తే జబర్దస్త్ క్రేజ్ పడిపోతుందని మల్లెమాలవారు అనుకున్నారని తెలిపారు. అందుచేతనే ఆ అగ్రిమెంట్ డబ్బులు ఇవ్వలేక బిగ్ బాస్ షోలోకి వెళ్లలేదని తెలిపారు.