మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఇక ఈ చిత్రం కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు ఇందులో మహేష్ కు జోడిగా పూజ హెగ్డే నటిస్తూ ఉన్నది. అయితే ఈ సినిమాలోని నటీనటుల రెమ్యూనరేషన్, బిజినెస్ గురించి ఇప్పుడు పలు వార్తలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి వాటి గురించి తెలుసుకుందాం.
ఈ చిత్రం కోసం మహేష్ బాబు ఏకంగా రూ. 65 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి షూటింగ్ మొదలకు కాకముందే దాదాపుగా రూ.285 కోట్ల రూపాయల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. ఇక సౌత్ లో డిజిటల్ రైట్స్ హక్కులను ఏకంగా రూ.100 కోట్ల రూపాయలు ఒక ప్రముఖ ఓటీటి సంస్థ కు అమ్మే నున్నట్లు సమాచారం. ఈ సినిమా హిందీ వెర్షన్ లో మాత్రం రిలీజ్ సమయానికి ఇంకా నిర్ణయం తీసుకోలేదు అన్నట్లుగా తెలుస్తోంది. హిందీలో ఈ సినిమా విడుదల చేస్తే దాదాపుగా 20 కోట్లకు పైగా కలెక్షన్లను రాబడుతుందని నిర్మాతలు సైతం భావిస్తున్నారు.
ఇక ఈ సినిమా ఆడియో హక్కులను రూ.8 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే విధంగా నిర్మాతల సైతం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలలోని థియేట్రికల్ హక్కులను రూ.120 కోట్ల రూపాయలు జరుగుతుందని నిర్మాతలు ఆశాభవాన్ని తెలియజేస్తున్నారు. ఈ సినిమాకి త్రివిక్రమ్ రెమ్యూనరేషన్ రూ.25 కోట్ల రూపాయలు ఉండనున్నట్లు సమాచారం. ఇక పూజ హెగ్డే కి కూడా రూ.4 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమాతో మహేష్ బాబు రేంజ్ పెరుగుతుందేమో చూడాలి మరి.