సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే అగ్ర హీరోలతో నటించి స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ ఖుష్బూ. ఒకానొక టైంలో ఖుష్బూ సినిమా వస్తుందంటేనే అభిమానులకు ఒక పండుగల ఉండేది. ఖుష్బూ మీద అభిమానంతో తమిళనాడులో కొన్ని ప్రాంతాలు ఆమెకు గుడికట్టి మరి పూజలు చేశారు. ఖుష్బూ అలా తన అందంతో అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చింది. ప్రస్తుతం ఖుష్బూ తన వయసుకు తగ్గ పాత్రలను నటిస్తూ. సీనియర్ నటిగా ఎంతో మంచి పేరు తెచ్చుకుంది.
ఖుష్బూ బుల్లితెర మీద కూడా ఎంతో సందడి చేస్తూ ఉంటుంది. ఖుష్బూ తెలుగులో బుల్లుతెర మీద వచ్చే జబర్దస్త్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంలోనే ఈ వారం వచ్చే ఎక్స్ట్రా జబర్దస్త్ కు సంబంధించిన ప్రోమో బయటకు వచ్చింది. ఇందులో ఖుష్బూ తన ప్రేమ పెళ్లికి సంబంధించిన విషయాలు చెప్పింది. ఈ ఎపిసోడ్ లో భాగంగా సుజాత, రాకింగ్ రాజేష్ స్కిట్లో భాగంగా మీ లవ్ స్టోరీ గురించి చెప్పండి మేడం అంటూ ఖుష్బూను అడుగుతాడు.
అప్పుడే ఖుష్బూ తన ప్రేమ గురించి చెపుతుంది. ఖుష్బూ తమిళ దర్శకుడు, నటుడైన సుందర్.సి ని వివాహం చేసుకుంది. ఈయన డైరెక్టర్ గా మారి చేసిన తొలి సినిమా మురై మామన్ సినిమా షూటింగ్ సమయంలో ఖుష్బూ ను చూసి లవ్లో పడ్డాడుఅట. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే సుందర్ ఖుష్బూకి ఐ లవ్ యు చెప్పాడు. తర్వాత ఖుష్బూ కూడా ప్రేమించి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు.
వీళ్ళిద్దరికీ పెళ్లి జరిగి 28 సంవత్సరాలు అయినప్పటికీ ఒకసారి కూడా ఖుష్బూ తన భర్తకి ఐ లవ్ యు చెప్పలేదట. షోలో భాగంగా ఇప్పుడు మీ భర్తకి ఐ లవ్ యు చెప్పనని అందరూ అడగగా ఖుష్బూ తన భర్తకి ఫోన్ చేసింది. ఖుష్బూ తన భర్త ఫోన్ నెంబర్ ని మై స్వీట్ హార్ట్ అని ఫీడ్ చేసుకుంది. ఇప్పుడు ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గా మారింది.