త్రివిక్రమ్‌తో మహేశ్ సినిమా.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్..

డైరెక్టర్ త్రివిక్రమ్- మహేశ్ బాబు కాంబోలో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.. ఇది ఇద్దరి కాంబినేషన్ లో రానున్న మూడో చిత్రం..ఈ సినిమా నుంచి మహేష్ ఫ్యాన్స్ కి ఫుల్ ఖుషీ అయ్యేలా అప్ డేట్ ఇచ్చారు త్రివిక్రమ్.. ఏకంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించేశాడు.. వచ్చే ఏడాది 28న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది మహేశ్ బాబుకు 28వ సినిమా.. SSMB28 సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందించనున్నాడు.. ఈ సినిమా రిలీట్ డేట్ ప్రకటనతో మహేశ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ డీలే అవుతుందని అభిమానులు నిరుత్సాహ పడ్డారు. అయితే త్రివిక్రమ్ మాత్రం ఏకండా రిలీజ్ డేట్ తో బిగ్ ట్రీట్ ఇచ్చేశారు.

SSMB28 అనౌన్స్ మెంట్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం నిరుత్సాహంతో ఉన్నట్లు తెలుస్తోంది.. ఎందుకంటే ఎన్టీఆర్ 30 సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో సినిమా ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉంది. అయితే పలు కారణాల వల్ల ఈ సినిమా మొదలుకాలేదు. జూన్ లోనే ఈ సినిమా ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఇంతవరకు సెట్స్ కి వెళ్లలేదు. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తమ హీరోను ట్రోల్ కూడా చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్నారు.

ఈక్రమంలో త్రివిక్రమ్ – మహేశ్ బాబు కాంబోలో వస్తున్న SSMB28 అనౌన్స్ మెంట్ వచ్చేసంది. దీంతో తారక్ అభిమానులు మళ్లీ రచ్చ చేస్తున్నారు. ‘మీ సినిమా ఎప్పుడు బాస్’ అంటూ కామెంట్లు చేయడం ప్రారంభించారు. సినిమా అప్ డేట్ ఇవ్వాలని కోరుతున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ ప్రారంభించాలని, సినిమా రిలీజ్ పై అప్ డేట్ ఇవ్వాలని ఎన్టీఆర్, కొరటాల శివపై సోషల్ మీడియాలో ఒత్తిడి తీసుకొస్తున్నారు. మరీ తారక్ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందో చూడాలి.