ఆ సినిమాకి రామ్ చరణ్ సీక్వెల్..వద్దు బాబోయ్ వద్దు..!?

రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీలోకి కాళ్ళు పెట్టి తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు.  రామ్ చరణ్ కెరియర్ లో ఎన్నో సినిమాలు సక్సెస్ అవుతాయి అనుకోని ఫ్లాప్ అయినవి ఉన్నాయి. వాటిల్లో ఒకటే ధ్రువ.”తని ఒరువన్ ” అనే టైటిల్ తో తమిళంలో వచ్చిన సినిమా. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిత్రాన్ని తెలుగులో ధ్రువ అనే పేరుతో మన మెగా పవర్ స్టార్ రాంచరణ్ రీమేక్ చేసిన సంగతి తెలిసిందే.

నిజానికి తమిళ్ లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అందుకుంది. కానీ తెలుగులో మాత్రం యావరేజ్ గానే మిగిలింది. ఈ సినిమాపై రామ్ చరణ్ బోలెడంత ఆశలు పెట్టుకొని ఉన్నారు. కానీ ఆ ఆశలన్నీ నిరాశగానే మిగిలాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి సీక్వెల్ తీయాలని రామ్ చరణ్ ఆలోచిస్తున్నారట. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులను బ్యాగ్రౌండ్ లో చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది.నిజానికి ధ్రువ కాన్సెప్ట్ చాలా కొత్తది.

” నీ శత్రువుని చూసి నీ కెపాసిటీ ఏంటో అంచనా వేయొచ్చు” అనే ఫార్ములా తోన ఓఐపిఎస్ అధికారి తన బలమైన శత్రువును ఎంచుకొని ఓ ఆట ఆడించి.. ఫైనల్ గా తానే విజయం సాధించేదే ఈ సినిమా. నిజానికి ఈ సినిమాకి నటీనటుల కన్నా స్క్రీన్ ప్లే నే ముఖ్యం. తెలుగులో ఈ కథను క్లారిటీగా చూపించలేకపోయాడు డైరెక్టర్.

కాగా త్వరలోనే ఈ సినిమాకి సీక్వెల్ రాబోతుంది అంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది . దీంతో మెగా ఫాన్స్ ఇలాంటి సినిమాకి సీక్వెల్ నా వద్దు బాబోయ్ ఇవ్వద్దు. ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో స్టేటస్ సంపాదించుకున్న రాంచరణ్.. ఇప్పుడు ఇలాంటి సినిమాకి సీక్వెల్ తీస్తే ఖచ్చితంగా ప్లాప్ అవుతుంది.. చరణ్ గారు వద్దు” అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.