నందమూరి హీరోల్లో ఒకడు అయిన కళ్యాణ్ రామ్ చాలా వైవిధ్యమైన నటుడు. కళ్యాణ్ సినిమాలు వైవిధ్యంగా ఉంటాయి. కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై ప్రెస్టేజ్గా సినిమాలు నిర్మిస్తున్నారు. ఇదే క్రమంలో కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను మల్లిడి వశిష్ట్ రెడ్డి అనే కొత్త దర్శకుడు తెరకెక్కించాడు. ఈ సినిమాల కేథరిన్ థెస్రా, సంయుక్తమీనన్ హీరోయిన్ల నటిస్తే కీరవాణి సంగీతం అందించారు. ఇప్పటికే బయటకు వచ్చిన ఈ సినిమా ట్రైలర్- టీజర్ -పాటలు అదిరిపోయే హైప్ని క్రియేట్ చేశాయి.
ఈ సినిమా యూనిట్ జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ గెస్ట్ రోల్ చేయమని కళ్యాణ్ రామ్ అడిగాడట. ఎన్టీఆర్ నటిస్తే ఈ సినిమాపై మరింత హైప్ వస్తుందని అనుకున్నారంట. ఓ సందర్భంలో ఈ గెస్ట్ రోల్ గురించి ఎన్టీఆర్ను అడగగా ఆయన నో చెప్పారట. ఈ సినిమా ప్రమోషన్ వరకు అయితే ఓకే కానీ… ప్రేక్షకుల అటెన్షన్, పబ్లిసిటీ కోసం తనకు నటించడం ఇష్టం లేదని ఎన్టీఆర్ చెప్పాడట.
ఇప్పుడు బింబిసార రిలీజ్ వేళ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏదేమైనా ఎన్టీఆర్ గెస్ట్ రోల్ చేసి ఉంటే అభిమానులకు ఇది పండగే పండగ. ఈ సినిమాను రు. 37 కోట్లు బడ్జెట్ తో కళ్యాణ్రామ్ నిర్మించారు. ఇదికళ్యాణ్ రామ్ సినిమాలలోనే భారీ బడ్జెట్ చిత్రంగా నిలవనుంది. ఎన్టీఆర్ సైతం ఈ సినిమా చూసి చాలా బాగుందని రివ్యూ కూడా చెప్పడంతో… ఈ సినిమాపై అభిమానుల్లో, ట్రేడ్ వర్గాల్లో భారీ హైప్ కూడా క్రియేట్అ యింది.