మంచు విష్ణును మ‌ళ్లీ కెలికిన శ్రీకాంత్‌… పంచ్ అదిరిందిగా…!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో శ్రీకాంత్ తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను బాగా అలరించారు. ముఖ్యంగా ఈ నటుడు చిరంజీవికి వీర అభిమాని అని చెప్పవచ్చు. అందుచేతనే చిరంజీవి సినిమాలో తనకు ఏదైనా పాత్ర వస్తే కచ్చితంగా వదులుకోకుండా వాటిలో నటిస్తూ ఉంటారు. ఇక తాజాగా చిరంజీవి సపోర్ట్ చేసిన ప్రకాష్ రాజు ప్యానెల్ లో పోటీగా నిలిచారు శ్రీకాంత్. అయితే అనూహ్యంగా మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే ఇదంతా ఇలా ఉండగా తాజాగా హీరో శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలు మరొకసారి పెను దుమారాన్ని సృష్టిస్తున్నాయి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.Meka Srikanth turns villain again!నిన్నటి రోజున హైదరాబాదులో సినీ సెలబ్రెటీల క్రికెట్ కార్నివాల్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా చిరంజీవి హాజరు కావడం జరిగింది ఆయనతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఇందులో పాల్గొన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో కొంతమంది నటులు ఒక అసోసియేషన్ గా ఏర్పడి క్రికెట్ టోర్నని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఇందులో శ్రీకాంత్, సుధీర్ బాబు, తరుణ్ తదితర హీరోలు పాల్గొనబోతున్నారు. అయితే ఈ క్రికెట్ కార్నివాల్ లో పాల్గొనేందుకు ఎక్కువగా మా ఎన్నికలలో పోటీ చేసిన వారే ఇందులో పాల్గొనబోతున్నట్లు సమాచారం.Prakash Raj takes on Manchu Vishnu in direct fight for MAA president

ఇక అంతేకాకుండా చిరంజీవిని ఉద్దేశించి శ్రీకాంత్ కూడా మాట్లాడడం జరిగింది మా కమిటీ పై ఇండైరెక్టుగా పలు పంచులు కూడా వేశారని సమాచారం. ఏదైనా మంచి పని చేయాలంటే చిరంజీవి ఎప్పుడు ముందు ఉంటారని.. గతంలో కూడా నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్,చిరంజీవి వంటి వారు క్రికెట్ మ్యాచ్ మొదలు పెట్టారని.. అలా ఆడడం వల్లే మొదటిసారి మా అసోసియేషన్ కి ఫండ్ బాగా వచ్చింది అని తెలిపారు శ్రీకాంత్. ఆ డబ్బులే ఇప్పుడు కూడా” మా “లో ఉన్నాయని కూడా తెలిపారు. మా అధ్యక్షుడిగా ఎన్నుకున్న వారు ఎవరు కూడా అంత తీసుకురాలేకపోయారని తెలిపారు. ప్రస్తుతం శ్రీకాంత్ అన్న మాటలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ప్రకాష్ రాజు పై పోటీపడి మంచు విష్ణు గెలిచిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో గెలిచినవారు రాజీనామా చేశారు. ఇప్పటికి కూడా ప్రకాష్ రాజ్ ప్యానల్, విష్ణు ప్యానల్ మధ్య విభేదాలు ఉన్నట్లుగా ఈ విషయంతో స్పష్టం అవుతుంది. ఇక మంచు విష్ణు కూడా మా బిల్డింగ్ పై ఎప్పుడు మాట్లాడకపోవడంతో ఈ విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది.