డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఎప్పుడు ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చెప్పలేము తాజాగా లైగర్ సినిమాని తెరకెక్కించి విడుదల చేశారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా.. అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. ఇక ఈ చిత్రంలో దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించారు. ఇక రమ్యకృష్ణ కూడా ఈ సినిమాకి ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ మాస్ ఆడియన్స్ ని అలరించారని చెప్పవచ్చు. కానీ ప్రీమియం షో ల నుంచే ఈ సినిమాకి బ్యాడ్ టాక్ మొదలైంది.
దీంతో మరొకసారి పూరి జగన్నాథ్ తన మార్కు ను చాటుకోలేకపోయారు. ఇక మరికొంతమంది నేటిజెన్లు మాత్రం ఈ సినిమాకి ఇంత బిల్డప్ అవసరమా అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి కొంతమంది బండ్ల గణేష్ చేసిన వాక్యాలను గుర్తుకు చేసుకొని.. పూరి జగన్నాథ్ పై విలుచుకుపడుతున్నారు. మరి కొంతమంది పూరి జగన్నాథ్ కి బండ్ల గణేష్ ఉసిరి తగిలింది అంటూ ట్రోల్ చేస్తూ ఉన్నారు. పూరి జగన్నాథ్ కుమారుడు నటించిన చోర్ బజార్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ బండ్ల గణేష్ పూరి జగన్నాథ్ పైన అటాజ్ చేయడం జరిగింది.
తన సొంత కొడుకుని పట్టించుకోకుండా ఎవరెవరును సూపర్ స్టార్స్ ని చేశావేంటి అంటూ బండ్ల గణేష్ పూరిని విమర్శించారు. దీంతో లైగర్ సినిమా టాక్ తేడా కొట్టడంతో తన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. బండ్ల గణేష్ ఉసురు, వదిన వసురు, పూరి కొడుకు ఉసురు బాగా తగిలింది అని అందుకే లైగర్ సినిమా భారీ డిజాస్టర్ అవుతోంది అంటూ కామెంట్ చేస్తున్నారు. దీంతో ఈ చెత్త సినిమాకి ఇన్ని సంవత్సరాలు టైమ్ తీసుకున్నావా అంటూ కామెంట్ చేస్తున్నారు. దీంతో రాను రాను పూరి జగన్నాథ్ ఆర్జీవి ల మారిపోతున్నాడు ఏంటి అంటూ నేటిజన్లు విమర్శలు చేస్తున్నారు.