తెలుగు ప్రేక్షకులకు ఈ ముద్దుగుమ్మ పేరు పెద్దగా పరిచయం అవసరం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మహేష్ బాబు హీరోగా నటించిన వన్ నేనొక్కడినే సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈమె మొదటి సినిమాతోనే గ్లామర్ షో చేస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక తన అందం, నటనతో, వరుస ఫోటోషూట్లతో ఎప్పటికప్పుడు తెలుగు ప్రేక్షకులను అలాగే బాలీవుడ్ ప్రేక్షకులను తన అందాలతో మెస్మరైజ్ చేసిందని చెప్పవచ్చు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ తో పోల్చుకుంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ స్టార్ డంను సంపాదించుకున్న కృతి సనన్ అక్కడ అగ్ర తారగా కొనసాగుతోంది.
ఇక ఈ క్రమంలోనే ప్రభాస్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ఆది పురుష్ సినిమా తో మరొకసారి తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమైంది కృతి సనన్. ఇక ఇలా ఒకవైపు పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ మరొకవైపు బాలీవుడ్ సినిమాలతో తన కెరీర్ ను బిజీగా నడుపుతున్న కృతి సనన్ సోషల్ మీడియాలో కూడా అంతే ఆక్టివ్ గా ఉంటూ ప్రతిరోజు తనకు సంబంధించిన ఫోటోలను ఆమె తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా నలుపు రంగు గౌన్ ధరించి ఫోటోలకు రొమాంటిక్గా ఫోజులు ఇవ్వడంతో ఈ ఫోటోలు చూసిన కర్ర కారు సైతం ఫిదా అవుతున్నారు.
ఎద అందాలను చూపిస్తూ థైస్ తో స్కిన్ షో చేసిన ఈ ముద్దుగుమ్మ బ్లాక్ డ్రెస్ లో దేవకన్యలా కనిపిస్తోందని చెప్పవచ్చు. ఇకపోతే ముంబైలో జరిగిన అవార్డు ఫంక్షన్ కి ఈ డ్రెస్ లో సందడి చేసిన కృతి అందరూ దృష్టిని బాగా ఆకర్షించింది .ఇకపోతే ప్రస్తుతం ఈమె ఈ అవార్డు ఫంక్షన్ కి ధరించిన గౌను ఖరీదు ఎంత అనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇక కృతి సనం ధరించిన ఈ గౌను ఖరీదు అక్షరాల రూ.7.4 లక్షలు అన్నట్లు సమాచారం. ప్రముఖ డిజైనర్ క్రిస్టియన్ అడ్నేవిక్ ప్రత్యేకంగా డిజైన్ చేశారట. ఇక ముంబైలో అవార్డు ఫంక్షన్ కోసమే ఆమె ఇలా ఇంత ఖర్చు పెట్టి తన డ్రెస్ ని డిజైన్ చేయించుకుందని సమాచారం.