అలనాటి హీరోలలో గుర్తుండి పోయే నటులలో హీరో శోభన్ బాబు కూడా ఒకరిని చెప్పవచ్చు. ఎక్కువగా మహిళల ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ఈ హీరో. ఇక ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో కూడా నటించి బాగా పాపులర్ అయ్యారు. ఇక ఇండస్ట్రీలో ఎంతో పలుకుబడి ఉన్నప్పటికీ తన కుటుంబం మాత్రం ఇండస్ట్రీకి దూరంగానే ఉన్నది. ఆంధ్ర సోగ్గాడిగా గుర్తింపు తెచ్చుకున్న ఈయనకు ఎంతోమంది అభిమానులు కూడా ఉన్నారు కానీ వయసు మీద పడడంతో ఆంధ్ర సోగ్గాడిని ప్రేక్షకులు మళ్లీ కోరుకుంటారు కదా.. ఆ అందం ఇప్పుడు లేదు అంటూనే హీరోగా సినిమాలకు కూడా గుడ్ బై చెప్పారు శోభన్ బాబు. అయితే పవన్ కళ్యాణ్, శోభన్ బాబు కాంబినేషన్లో ఒక సినిమా రావాల్సి ఉండేది. కానీ అది ఎందుకు నిలిచిపోయిందో ఇప్పుడు తెలుసుకుందాం.
పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ భీమిలి శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం సుస్వాగతం. ఈ సినిమా ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా ఎమోషనల్ గా ఎంతో మంది ప్రేక్షకులను ఫిదా అయ్యేలా చేసింది. ముఖ్యంగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తండ్రి పాత్ర చాలా కీలకమైనది. ఆ పాత్ర ప్రముఖ నటుడు రఘువరన్ నటించి మెప్పించారు. అయితే వాస్తవానికి ఈ సినిమాలోని పాత్ర కోసం దర్శకుడు ముందుగా శోభన్ బాబునే అడిగారట.
అయితే శోభన్ బాబు అప్పటికి సినిమాలకు గుడ్ బై చెప్పి ఖాళీగా ఉండడంతో తాను నటించనని చెప్పేశారట. అంతేకాకుండా శోభన్ బాబు మాట్లాడుతూ తనని ఎప్పటికీ తమ అభిమానుల హీరోగా, అందంగా ఉండే శోభన్ బాబు ను మాత్రమే గుర్తుపెట్టుకోవాలని.. తన వయసు తగ్గాక సినిమాలకు గుడ్ బై చెప్పారనే అనుకోవాలని శోభన్ బాబు తెలిపారుట. అందుచేతనే ఈ పాత్ర నటుడు రఘువరన్ దగ్గరకు వెళ్ళింది . రఘు వరున్ కూడా ఈ సినిమాలో ఎంతో అద్భుతంగా నటించారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ ,శోభన్ బాబు కలిసి ఈ సినిమాలో నటించి ఉంటే ఈ పాత్ర ఎలా ఉండేదో చెప్పలేమని చెప్పవచ్చు. అలా శోభన్ బాబు , పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఈ సినిమా మిస్ అయింది అని చెప్పవచ్చు.