టాలీవుడ్ డైరెక్టర్లు ఒకటి చెప్పి మరొకటి చేస్తున్నారు.. ఇలా అయితే కష్టమే!

అవును, మీరు విన్నది నిజమే. టాలీవుడ్ డైరెక్టర్లు ఒకటి చెప్పి మరొకటి చేస్తున్నారు.. ఇలా అయితే కష్టమే అని అంటున్నాయి కొన్ని సర్వేలు. సినిమా ప్రారంభం రోజునే కొంత మంది దర్శక-నిర్మాతలు రిలీజ్ తేదిని ప్రకటిస్తారు. కానీ అనుకున్న సమయానికి మాత్రం సినిమా రాదు. అలా ప్రకటించి అదే డేట్ కి సినిమా తెచ్చేది తెలుగు పరిశ్రమలో ఒక్క పూరి జగన్నాధ్ మాత్రమే. దానికి ఎంతో ప్లానింగ్ ఉండాలి. మిగతావాళ్లకు ఈ ప్లాన్ ఉండదు. పైగా నిర్మాతలకు కొండంత భారం. ఆ అర్డర్ లో ఎక్కడ మార్పులు చోటు చేసుకున్నా సీన్ మొత్తం మారిపోతుంది.

ఇక ఈ విషయంలో చిన్న సినిమా.. పెద్ద సినిమా అనే తేడా ఉండదు. దేనికైనా ఒకటే సూత్రం వర్తిస్తుంది. అయితే ఇలాంటి ప్లానింగ్ కి ఎన్నో విషయాలు సహకరించాల్సి ఉంటుంది. అప్పుడే వాటి రిలీజ్ చెప్పిన తేదీలకు పక్కాగా జరుగుతుంది. ఇటీవలి కాలంలో చాలా సినిమాలు రిలీజ్ తేదీల్ని ముందుగా ప్రకటించడం లేదు. ఈ మధ్యల కాలంలో రిలీజ్ తేదీలు ప్రకటించి చివరి నిమిషంలో వాయిదా పడిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఇటీవలే హిట్-2 సినిమా రిలీజ్ తేదీ మారినట్లు అడవి శేషు ప్రకటించిన సంగతి తెలిసిందే.

అలాగే మేజర్ సినిమా షూటింగ్ ప్లానింగ్ ప్రకారం జరగకపోవడంతో హిట్-2`ని అనుకున్న సమయంలో పూర్తిచేయలేకపోయినట్లు సమాచారం. అలాగే అఖిల్ `ఏజెంట్ విషయంలోనూ ఇదే జరిగుతోంది. ఆగస్టు 12న చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేసారు. కానీ షూటింగ్ డిలే అవ్వడంతో ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా క్లారిటీ లేకుండా పోయింది. ఇక సమంత లీడ్ రోల్ తెరకెక్కుతోన్న యశోద విషయంలోనూ ఇదే జరుగుతోంది. VFX కారణంగా సినిమాని వాయిదా వేస్తున్నామని మేకర్స్ చెప్పుకొస్తున్నారు. ఇక మాస్ రాజా రవితేజ్ కథానాయకుడిగా నటిస్తోన్న రావణాసూర విషయంలో కూడా వాయిదా తప్పేలా లేదని వినబడుతోంది. ఈ తరుణంలో కొన్ని విమర్శలు వస్తున్నాయి.. నటీనటులు, దర్శకుడు బాగానే వున్నారు కానీ ఈ లేట్ కారణంగా నిర్మాతలు బలి అవుతున్నారని వినికిడి.