#RC 15 అభిమానులకు షాక్.. సినిమా మరింత ఆలస్యం.. కారణం..?

ప్రముఖ క్రియేటివ్ పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్గా తెరకెక్కుతున్న చిత్రం #RC 15.. ఈ చిత్రానికి అధికారికంగా సినిమా టైటిల్ ప్రకటించలేదు.. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు జీ సినిమాస్ కూడా భాగస్వామి అవ్వడం జరిగింది. ఇకపోతే భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమాను నిర్మిస్తుండగా ఇప్పటికే ఈస్ట్ గోదావరి, విశాఖ, అమృత్సర్ ఇలా పలు ప్రాంతాలలో షూటింగులు పూర్తి చేశారు. ముఖ్యంగా శంకర్ దర్శకత్వం అంటే ఏ రేంజ్ లో ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సీన్లను శిల్పాలు చెక్కినట్లు చెక్కి.. పర్ఫెక్షన్ కోసం చూసే ఆయన షూటింగ్ మాత్రం చకచకా సాగదు అని చెప్పాలి . ముఖ్యంగా ఈ సినిమా స్పెషాలిటీ ఏమిటంటే శంకర్ ఈసారి కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉపయోగించకుండా సహజమైన సెట్ ల మీద ఎక్కువ దృష్టి పెట్టినట్లు సమాచారం.RC 15: Ram Charan And Shankar's Untitled Movie Is Launched Officially

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగుకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. అసలు విషయం ఏమిటంటే శంకర్ దర్శకత్వం వహించిన జెంటిల్మెన్ సినిమా నుంచి రోబో సినిమా వరకు చూసుకుంటే పాటలకు సెట్ లు ఏ రేంజ్ లో ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు.. ఇక అసలే శంకర్.. రామ్ చరణ్ తో పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. దానికి తోడు భారీ సెట్ లు.. ఖర్చు బాగా పెరుగుతోందని ఈ క్రమంలోని నిర్మాత దిల్ రాజుకు , ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణకు మధ్య విభేదాలు వచ్చినట్లు సమాచారం. కొన్ని రోజుల నుంచి సాగుతున్న ఈ భేదాభిప్రాయాలు పెరిగి ఆర్ట్ డైరెక్టర్ ను మార్చే దిశగా దిల్ రాజు చూస్తున్నట్లు సమాచారం. ఇకపోతే నిజంగానే ఆర్ట్ డైరెక్టర్ ను మార్చారా ?లేక మారుస్తున్నారా? ఒకవేళ కొత్త ఆర్ట్ డైరెక్టర్ వస్తే దర్శకుడు శంకర్ తో సింక్ కావాలి కదా అన్ని సెట్ కావాలి అంటే ఇంకా ఆలస్యం అయ్యేలాగా కనిపిస్తోంది. దీంతో సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. ఇక విషయం తెలుసుకున్న రామ్ చరణ్ అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు.