సమంత.. నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత కూడా ఇప్పటికీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. ముఖ్యంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట అనుకోకుండా విడాకులు తీసుకోవడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇక చాలామంది ఎక్కువగా సమంతనే టార్గెట్ చేస్తూ ఆమెపై నెగెటివిటీ ఎక్కువగా ప్రచారం చేశారు. కానీ వాటిపై ఆమె ఏ రోజు స్పందించలేదు. ఇక ప్రస్తుతం తన కెరియర్ ను ఉన్నత స్థానానికి తీసుకెళ్లాలనే ప్రయత్నంలోనే వరుస సినిమాలు చేస్తూ బాలీవుడ్ ,హాలీవుడ్ అనే తేడా లేకుండా అన్నింటిలో కూడా నటించడానికి సిద్ధమవుతోంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోని బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ తో కలిసి ఒక సినిమా చేస్తున్న నేపథ్యంలో బాలీవుడ్ సినీ ప్రేక్షకులకు కూడా దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తోంది.
ఇక ఈ క్రమంలోనే కాఫీ విత్ కరణ్ షో కి హాజరైన సమంత తన విడాకుల విషయంపై పూర్తి క్లారిటీ ఇచ్చింది. నాగ చైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత భరణం కింద 250 కోట్ల రూపాయలు తీసుకుందని వార్త వచ్చినా ఇందులో నిజం లేదని ఆమె ఆరోజే స్పష్టత ఇచ్చింది. కానీ మరొకసారి తన వ్యక్తిగత విషయాలను అడగను అని చెబుతూనే విడాకుల విషయం గురించి కరణ్ స్పందించమని అడిగాడు. ఈ క్రమంలోని ఇష్టం లేకపోయినా విడాకులు తీసుకున్నాను అంటూ హాట్ బాంబు పేల్చింది సమంత.ఇక 250 కోట్ల రూపాయలు భరణం కింద తీసుకున్నాను అనే వార్తలో ఏమాత్రం నిజం లేదు అని.. ఆ సమయంలో ఒకవేళ ఇన్కమ్ టాక్స్ వాళ్ళు నా ఇంట్లో రైడ్ చేసి ఉంటే కనీసం వాళ్ళైనా చెప్పి ఉండేవారు కదా అని అనుకున్నానని అంటూ సమంత తెలియజేసింది.
సమంత కరణ్ జోహార్ ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ.. మా విడాకులు అంతసామరస్యంగా జరగలేదు. విడాకులు తీసుకోవడం చాలా కష్టమైన ప్రక్రియ. తీసుకున్న తర్వాత కొత్తలో చాలా బాధపడ్డాను. నా జీవితం చాలా కఠినంగా అనిపించింది. కానీ ఇప్పుడు దాని నుంచి బయటపడ్డాను మునపటి కంటే ఇప్పుడు మరింత స్ట్రాంగ్ గా తయారయ్యాను. ఇక నా పని నేను చేసుకుంటూ దూసుకుపోతున్నాను అంటూ సమంత క్లారిటీ ఇచ్చింది.