సాధారణంగా ఒక సినిమా విజయవంతం సాధించాలి అంటే ప్రేక్షకుల ఆదరణ ఎంతో అవసరం అవుతుంది. ఇక వారు తీసే సినిమా జనాల్లోకి వెళ్లాలి అంటే కచ్చితంగా ప్రమోషన్స్ అనేది అవసరం. ముఖ్యంగా అన్ని సినిమాల లాగా కాకుండా తమ సినిమాలకు కూడా ఒక ప్రత్యేకత ఉండాలి అని కొత్త కొత్త ఆలోచనలతో ప్రమోషన్స్ మొదలు పెడుతున్నారు దర్శకనిర్మాతలు. ఈ క్రమంలోనే ప్రేక్షకుల దృష్టిలోకి తమ సినిమాలను ఎలా తీసుకెళ్తే వాళ్లకు కనెక్ట్ అవుతుందనే విషయం మీద కూడా దృష్టి పెడుతున్నారు. ఇక అంతే కాదు తమ సినిమాను ప్రేక్షకులలోకి తీసుకెళ్లడానికి కొన్ని లక్షల రూపాయలను కూడా ఖర్చు చేయడానికి నిర్మాతలు వెనుకాడడం లేదు.
అంతేకాకుండా హీరో హీరోయిన్స్ తో ఎన్నో కార్యక్రమాలలో ఇంటర్వ్యూలు కూడా ఇస్తూ ఉంటారు. ఇక అప్పుడే ప్రేక్షకులను సినిమా థియేటర్ల వరకు రప్పించగలము అని మూవీ మేకర్స్ చెబుతూ ఉంటారు. ఇకపోతే ఇంట్లో ఉండే సినీ ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వాలంటే ముఖ్యంగా బుల్లితెరను ఆశ్రయించాల్సిందే. మరి అధికంగా బుల్లితెర ప్రేక్షకులను అలరించే షో లు ఏంటంటే వాళ్ళు నిర్వహించే జబర్దస్త్ షో, శ్రీదేవి డ్రామా కంపెనీ అని చెప్పవచ్చు. ఇక ఈ షోలో మన జబర్దస్త్ కమెడీయన్స్ సినిమా గురించి స్కిట్లు చేస్తే సినిమాను ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఇక ఈ క్రమంలోనే ఒక సినిమాను ప్రమోట్ చేయడానికి దర్శక నిర్మాతలు మల్లెమాల ఎంటర్టైన్మెంట్ వారికి దాదాపుగా 15 లక్షల రూపాయల వరకు అందిస్తారట..
అదే సుమలాంటి స్టార్ యాంకర్ నిర్వహిస్తున్న క్యాష్ ప్రోగ్రామ్ ద్వారా సినిమాను ప్రమోట్ చేస్తే ఏకంగా రూ.10 నుండి రూ.15 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఇలా సినిమాలకు ప్రమోట్ చేయడం ద్వారా మంచి సంపాదన వెనుక వేసుకుంటోంది మల్లెమాల ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్. మొత్తానికి అయితే అటు షోల ద్వారా ఇటు ప్రమోషన్స్ ద్వారా బాగా సంపాదన పొందుతోంది మల్లెమాల. .