ప్రముఖ సీనియర్ నటి పవిత్ర లోకేష్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందిన ఈమె తెలుగు, తమిళ్ భాషలలో వరుస అవకాశాలను అందిపుచ్చుకొని స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకోవడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకుంది. ఇక గతంలో వయ్యారాలు వొలకబోస్తూ సెగలు పుట్టించిన పవిత్ర లోకేష్ ప్రస్తుతం హీరో హీరోయిన్లకు తల్లి, అత్త , వదిన లాంటి వయసుకు తగ్గ పాత్రలలో నటించడమే కాకుండా వరుస అవకాశాలను అందుకుంటూ బిజీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకుంటుంది. ఇదిలా ఉండగా తాజాగా పవిత్ర లోకేష్ నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాల్లో ఈమె పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా దివ్యాంశ కౌశిక్ , రజీషా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం రిజల్ట్ విషయాన్ని పక్కన పెడితే పవిత్ర లోకేష్ కి ఉన్న క్రేజ్ ఈ సినిమా ద్వారా బయటపడిందని చెప్పవచ్చు. నిజానికి థియేటర్లలో సినిమా టైటిల్ పేరు, దర్శకుడు పేరు, హీరో హీరోయిన్ల ఎంట్రీ వస్తే ప్రేక్షకులు ఈలలు వేస్తూ గోల చేస్తారు. కానీ ఇక్కడ అంతా రివర్స్ అనే చెప్పాలి. రామారావు ఆన్ డ్యూటీ సినిమా థియేటర్లలో మొదటి బొమ్మ పడగానే పవిత్ర లోకేష్ చెప్పే డైలాగ్ కు ప్రేక్షకులు సైతం ఈలలు కొడుతూ గోలగోల చేస్తున్నారు.అంతేకాదు ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేష్ తో ఈమె ఒక సన్నివేశంలో కనిపించింది. ఇక ఇలా కనిపించిన వెంటనే థియేటర్లలో ఓ అంటూ అరుపులు ఈలలతో ప్రేక్షకులు గోల చేయడం చూసి పవిత్ర లోకేష్ కు ఇంత క్రేజ్ ఉందా అని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.
అంతేకాదు ఈ సినిమాలో రవితేజ ఇంట్రడక్షన్ సీన్ కి క్రేజ్ రాలేదు అంటే ఇక హీరోయిన్లుగా నటించిన దివ్యాంశ కౌశిక్ రజీషా విజయన్ లను పట్టించుకోలేదని చెప్పవచ్చు. ఇక దీన్ని బట్టి చూస్తే పవిత్ర లోకేష్ కి ఏ స్థాయిలో క్రేజ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఈమెకు ఇంత క్రేజ్ రావడానికి కారణం నరేష్ తో సహజీవనం అనే వ్యాఖ్యలు.. గొడవల్లోకి ఆయన మూడో భార్య రమ్య రఘుపతి ఎంట్రీ ఇవ్వడం.. పలు వార్తలు వైరల్ అవ్వడంతో పవిత్ర లోకేష్ కు విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఒక రకంగా చెప్పాలి అంటే హీరోయిన్లకు మించి క్రేజ్ ను సంపాదించుకుంది పవిత్ర లోకేష్.