రమ్యకృష్ణ – కృష్ణవంశీ యవ్వారం చెడిందా? తాజా ఇంటర్వ్యూతో క్లారిటీ?

తెలుగు చిత్ర పరిశ్రమలో వున్న బెస్ట్ పెయిర్ లలో రమ్యకృష్ణ – కృష్ణవంశీ జంట ఒకటి. అయితే గత కొన్నాళ్ళుగా వీరిపైన ఒకవిధమైనటువంటి రూమర్స్ మీడియాలలో నడుస్తున్నాయి. దానికి వారు అనేక సార్లు బదులు ఇచ్చారు కూడా. అయినా ఈ వార్తలకు మాత్రం ఫుల్ స్టాప్ పడటంలేదు. తాజాగా వీటికి వేదికయ్యింది ఓ ఇంటర్వ్యూ. ఇకపోతే కృష్ణ వంశీ రంగమార్తాండ మూవీ ప్రమోషన్లలో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న సంగతి తెలిసినదే. ఈ క్రమంలో కృష్ణవంశీ కొన్ని ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటున్నారు.

అసలు విషయం ఇదే:

ఓ ఇంటర్వ్యూ వేదికగా సదరు యాంకర్ ‘మీకు, మీ భార్య రమ్యకృష్ణ’ విషయంలో ఏమన్నా తగాదాలు ఉన్నాయా? అనే ఓ ప్రశ్న వేశారు. దానికి కృష్ణ వంశీ బదులు ఇస్తూ… “నేను చాలా సార్లు చెప్పాను. కావాలంటే ఒకసారి రికలెక్టు చేసుకోండి. ఎన్ని సార్లు అడిగినా ఒకటే ఆన్సర్. మేము ఎంతో సంతోషంగా వున్నాం. పని రీత్యా నేను హైద్రాబాద్లో వుంటాను. తాను మా బాబుతో కలిసి చెన్నై లో వుంటుంది. అప్పుడప్పుడు ఇద్దరం కలిసి సరదాగా టూర్స్ వెళుతుంటాం. మా బంధం ఏంటో అన్యోన్యంగా వుంది. దయచేసి మన్నల్ని కెలకవద్దు.” అని సమాధానం ఇచ్చారు.

మరింత సమాచారం:

ఈ మీడియా వేదికగా ఆయన ‘రంగమార్తాండ’ సినిమా విశేషాలను కూడా పంచుకున్నారు. సీనియర్ నటి శారద సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని కృష్ణవంశీ చెప్పుకొచ్చారు. అలాగే శ్రీకాంత్ 100వ సినిమా ముందుగా అనుకున్నది కాదని, ఏదో అలా జరిగిపోయిందని చెప్పుకొచ్చారు. ఇక సిరివెన్నెల గారికి నా ఆలోచనలు చెప్పి పాటలు రాయించుకున్నానని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రిగారితో పనిచేయడం ఓ అద్భుతం అని అన్నారు. సిరివెన్నెల సినిమా పరిశ్రమకు ఓ తీరని లోటు అని అభిప్రాయపడ్డారు.