ఏపని తెలిసినవారు ఆ పనిని చేస్తూ పోతుంటారు. సినిమాలలో నటిస్తున్న కొందరు అగ్ర హీరోలు థియేటర్ లు కడుతున్నారు. దానికి ఓ పెద్ద ఉదాహరణగా మహేశ్ బాబుని చెప్పుకోవచ్చు. మహేశ్ బాబు గచ్చిబౌలిలో AMB పేరుతో భారీ ఏషియన్ మల్టీప్లెక్స్ ను అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేశారు. అంతే కాకుండా రీసెంట్ గా స్టార్ గా మారిన విజయ్ దేవరకొండకు కూడా ఓ మల్టీప్లెక్స్ ఉందంటే అందులో వింతేమీ లేదు.
అదే విధంగా హీరో వెంకటేష్, రానాలు కూడా ఈ రంగంలోకి అడుగుపెట్టబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇదంతా ఇప్పటిమాట. ఇప్పుడే కాదు ఒకప్పటి స్టార్ హీరోలు కూడా థియేటర్ లను నిర్మించారు. Sr. NTR సొంతంగా అధునూతన హంగులతో ఓ థియేటర్ ను అప్పట్లో నిర్మించుకున్నారు. ఈ థియేటర్ ను హైదరాబాద్ లో రెండున్నర ఎకరాల్లో NTR ఎస్టేట్ లో నిర్మించారు.
NTR రామకృష్ణ 70ఎంఎం మరియు 35ఎంఎం అనే పేర్లతో ఓ జంట థియేటర్ లను నిర్మించారు. అందులోనే షాపింగ్ కాంప్లెక్స్ ను కూడా ఏర్పాటు చేశారు. ఈ థియేటర్ లకు ‘రామకృష్ణ’ అని పేరు పెట్టడం వెనక ఒక కారణం కూడా ఉంది. NTR పెద్ద కుమారుడు పేరు రామృష్ణ. ఆయన పేరుతోనే ఈ థియేటర్ ను నిర్మించారు. ఆంధ్రప్రదేశ్ లోనే ఇది మొదటి ఎయిర్ కండిషనర్ థియేటర్ కావడం విశేషం.
ఈ థియేటర్ ను ఎంతో కళాత్మకంగా NTR అభిరుచికి తగ్గట్టుగా నిర్మించారు. అప్పట్లో ఈ థియేటర్ కు భారీ సంఖ్యలో ప్రేక్షకులు వచ్చేవారు. కానీ NTR మరణాంతరం ఈ థియేటర్ లు కాస్త వెనకబడ్డాయి. తెలుగుదేశం హయాంలోనే ఈ థియేటర్ లలో భూతు చిత్రాలు ప్రదర్శించడం విషాదకరం. అయితే ఇటీవలి కాలంలో ‘ఇంద్ర సంస్థ’ వీటిని తిరిగి అభివృద్ది చేసింది. దాంతో ఈ థియేటర్ లకు పూర్వవైభవం వచ్చింది.