తల్లి కాలేని కళ్యాణి ఆస్తులపై దర్శకుడు షాకింగ్ కామెంట్స్..!!

ప్రముఖ స్టార్ హీరోయిన్ కళ్యాణి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతంలోనే తన అందంతో.. నటనతో ఎంతో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇక మరింత పాపులారిటీని సంపాదించుకొని స్టార్ హీరోలతో కలిసి నటించింది. తన కెరియర్ పీక్స్ లో ఉండగానే ప్రముఖ దర్శకుడు సూర్యకిరణ్ ను వివాహం చేసుకుంది. సూర్య కిరణ్ కూడా కేవలం డైరెక్టర్ మాత్రమే కాదు చైల్డ్ ఆర్టిస్టుగా 200 సినిమాలకు పైగా నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు తన నటనతో ఏకంగా పదుల సంఖ్యలో అవార్డ్ లను కూడా సొంతం చేసుకున్నాడు.

ఆ తర్వాత డైరెక్టర్గా తన కెరీర్ ను మొదలుపెట్టినా.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకోవడంతో ఇక సినీ కెరియర్ లో ఎటువంటి అడ్డంకులు ఉండవని అనుకున్నాడు. కానీ ఈయన దర్శకత్వంలో వచ్చిన సత్యం సినిమా మినహాయిస్తే అన్ని సినిమాలు కూడా డిజాస్టర్ ను మిగిల్చాయి. ఇక అప్పటికే ప్రముఖ హీరోయిన్ కల్యాణిని ప్రేమించి మరి వివాహం చేసుకున్నారు. ఇక అయినా కూడా ఈయనకు సరైన హిట్టు లేక ఆర్థిక ఇబ్బందుల్లో మునిగితేలాడు. ఇక దీంతో ఇద్దరి మధ్య ఆర్థిక సమస్యలు రావడంతో కళ్యాణి ఆస్తులు కూడా అతడే పోగొట్టారని అందుకే ఇద్దరు విడిపోయారు అనే వార్తలు బాగా వైరల్ అయ్యాయి..కళ్యాణినే నన్ను వదిలేసింది….ఈ జన్మలో నాకు తీరని లోటు అది : సూర్య కిరణ్ - Filmy Focus

ఇక ఈ విషయంపై సూర్యకిరణ్ మాట్లాడుతూ.. నాకు హైదరాబాదు , కేరళలో ఉన్న ఆస్తులన్నీ కూడా పోయాయి. కళ్యాణి నేను ఇద్దరం కలిసి ఒక బోట్ హౌస్ కొన్నాము. అది మాత్రమే నేను తీసుకున్నాను. ఇక కళ్యాణికి సంబంధించిన ఎటువంటి ఆస్తులను కూడా నేను ముట్టుకోలేదని సూర్యకిరణ్ క్లారిటీ ఇచ్చారు. పిల్లలు లేకపోవడం కారణంగా కళ్యాణి ఆస్తులు కూడా నాకు లభించలేదు అని ఆమెకు సంబంధించిన అన్ని ఆస్తి వ్యవహారాలను తన తల్లి మేనేజ్ చేస్తుందని ఇక తన తప్పు ఇందులో ఏమాత్రం లేదు అని సూర్యకిరణ్ వెల్లడించారు. అంతేకాదు ఇందులో కళ్యాణి ప్రమేయం కూడా లేదు అని ఆమెను కూడా తప్పు పట్టడానికి లేదు అని సూర్య కిరణ్ వెల్లడించారు.

తన చెల్లి ఆస్తులను తన తల్లి మేనేజ్ చేస్తుందని అలాగే కళ్యాణి ఆస్తులను కూడా వాళ్ళ అమ్మ మేనేజ్ చేస్తుందని సూర్యకిరణ్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఇక మొత్తానికైతే కళ్యాణికి సంబంధించిన ఆస్తులను తన తల్లి చూసుకుంటుంది కాబట్టి .. ఇక పిల్లలు కూడా లేకపోవడం వల్ల నాకు కూడా ఎలాంటి సంబంధం లేదు అని సూర్యకిరణ్ వెల్లడించారు.