ఆ చెంప దెబ్బ వల్లే నేడు ఈ స్థాయిలో ఉన్నా.. ధనుష్..!!

తమిళ్ సినీ ఇండస్ట్రీలోకి దర్శకుడు కస్తూరి రాజా కుమారుడిగా తన కెరీర్ ను మొదలుపెట్టిన హీరో ధనుష్ .. ఆ తర్వాత తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ ను వివాహం చేసుకున్న తర్వాత ఈయన క్రేజ్ మరింత పెరిగిపోయిందని చెప్పవచ్చు. ఇక ధనుష్ తీసే ప్రతీ మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడమే కాకుండా ఈయనను స్టార్ హీరోగా నిలబెట్టింది. ముఖ్యంగా ప్రస్తుతం దక్షిణాది సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా చలామణి అవుతూ.. పారితోషకం విషయంలో కూడా అంతే దూసుకుపోతూ ఉంటారు.

ఇక సినీ ఇండస్ట్రీలో సక్సెస్ అయినంతగా వ్యక్తిగత జీవితంలో సక్సెస్ పొందలేకపోయారు. ఇక సుమారు 19 సంవత్సరాలు పాటు వైవాహిక జీవితాన్ని గడిపి ఇద్దరు కొడుకులకు జన్మనిచ్చిన తర్వాత ధనుష్ తన భార్యతో ఇలా విడాకులు తీసుకొని మరొకసారి చర్చకు తెరలేపాడు. అయితే కొంతమంది హీరోయిన్లతో ఈయనకు ఉండే ఎఫైర్ వల్లే తన భార్యకు విడాకులు ఇచ్చాడు అనే వార్త కూడా బాగా వైరల్ అయింది. కానీ ధనుష్ ఈ విషయంపై ఏ మాత్రం స్పందించకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూ కి హాజరైన ఈయన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు..

ఈ ఇంటర్వ్యూలో భాగంగానే ఆయన మాట్లాడుతూ..మా అన్నయ్య సెల్వ రాఘవన్ దర్శకత్వంలో కాదల్ కొండేయిన్ సినిమాతో స్టార్ హీరోగా మారిపోయాను. ఇకపోతే ఈ సినిమాలో అన్నయ్యకు నచ్చిన విధంగా సీన్ రావడం కోసం తనను కొట్టారు. ఇలా అన్నయ్య చేతిలో దెబ్బలు తినడం వల్ల ఈ సినిమా బ్లాక్ బాస్టర్ విజయం అయింది. అంతేకాదు ఆరోజు దర్శకుడిగా అన్నయ్య చేతిలో దెబ్బలు తినడం వల్లే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటూ ఆయన వెల్లడించారు.