టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ గత రెండు రోజుల నుండి వార్తల్లో నిలుస్తున్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఓ యూట్యూబర్తో కలిసి చేసిన ప్రాంక్ పెద్ద రచ్చకు దారి తీసింది. సినిమా ప్రమోషన్స్ కోసం ఇంతలా దిగజారుతారా అంటూ అందరూ విశ్వక్ సేన్ను ఓ రేంజ్లో ఆడేసుకుంటున్నారు.
ఇక రీసెంట్గా టీవీ9 ఛానల్లో ఇదే అంశంపై ఓ డిబేట్లో పాల్గొన్నాడు ఈ హీరో. అయితే సదరు టీవీ ఛానల్ యాంకర్ దేవి విశ్వక్ సేన్పై విరుచుకుపడింది. అతడిని దుర్బాషలాడుతూ ‘డిప్రెస్డ్ మ్యాన్’, ‘పాగల్ సేన్’ అంటూ పిలిచింది. దీంతో ఈ మాస్ హీరోకు కోపం వచ్చింది. అయితే దేవి ఇంతటితో ఆగకుండా గెట్ అవుట్ అంటూ విశ్వక్ సేన్పై విరుచుకుపడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.
కాగా తాజాగా టీవీ9 యాంకర్ దేవిపై విశ్వక్ సేన్ పరువునష్టం దావా వేశాడు. తన క్యారెక్టర్ను ఇన్సల్ట్ చేసేలా ఆమె మాట్లాడిందంటూ విశ్వక్ సేన్ కోర్టులో కేసు వేశాడు. మరి ఈ అంశం ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి అంటున్నారు ఇవన్నీ గమనిస్తున్న అభిమానులు. ఇక విశ్వక్ సేన్ నటించిన అశోక వనంలో అర్జున కళ్యానం సినిమా మే 6న రిలీజ్కు రెడీ అయ్యింది.